*ఉచితంగా మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన*
*సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి*
*డాక్టర్ రాజేందర్ మార్కెట్ డైరెక్టర్ సదానందం*
*జమ్మికుంట జూన్ 17 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించగా విశేష స్పందన వచ్చిందని డాక్టర్ కందికొండ రాజేందర్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ సదానందం తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత తో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్లనే సీజనల్ వ్యాధులకు స్వస్తి పలకవచ్చని బాలవికాస స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో అమృత న్యూరో ఆస్పత్రి వైద్యులు మంగళవారం మడిపల్లి గ్రామంలో నిర్వహించిన వైద్య శిబిరంలో పేర్కొన్నారు వ్యాధులు సోకిన తర్వాత వైద్యానికి వచ్చే కంటే వ్యాధుల నివారణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా వైద్య పరీక్షలు చేసుకోవడం వల్ల వ్యాధులను ప్రారంభంలోనే గుర్తించడం వల్ల ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, బ్రెయిన్ స్ట్రోక్లను నివారించవచ్చునని తెలిపారు ఒక మనిషి సగటున రోజుకు ఐదు గ్రాముల కంటే తక్కువ ఉప్పు తినాలని జాతీయ పోషకాహార సంస్థలు సూచిస్తున్న కూడా ప్రజలు పెడచెవిన పెడుతున్నారని రోజుకు 12 గ్రాముల కంటే ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, గుండెపోటు, మూత్రపిండాల సమస్యలు అధికం అవుతున్నాయని ఆయన వాపోయారు. బాలవికాస సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన మాట్లాడుతూ మహిళలు చైతన్యవంతం అయినప్పుడే ఆరోగ్యకరమైన సమాజం ఆవిర్భవిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బాలవికాస కోఆర్డినేటర్ ఆసియా అమృత న్యూరో హాస్పిటల్ మేనేజ్మెంట్ కిరణ్,PRO శ్రీకాంత్, స్టాప్. పూజ, సుప్రతిక, శ్రావణి, రాజు, అన్వేష్ మరియు మడిపల్లి గ్రామ కార్యదర్శి అంజిరెడ్డి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.