ప్రశ్న ఆయుధం న్యూస్ మార్చి 26 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల జడ్పిటిసి,ఎంపీటీసీ స్థానిక రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తావించిన కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కునంనేని సాంబశివరావుకు షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.కొత్తగూడెం సింగరేణి ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల కార్యాలయంలో కృతజ్ఞత సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రంలో సగo భూభాగం వెనుకబడ్డ ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడ్డ ఎస్సీ కులాల అభివృద్ధి పై తెలంగాణ రాష్ట్ర సిపిఐ పార్టీ కార్యదర్శి కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అసెంబ్లీలో ప్రస్తావించడం లక్షలాదిమంది ఎస్సీ కులాల పేద ప్రజలకు ఎంతో మనో ధైర్యాన్ని కలిగించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సీ కులాల రాష్ట్ర మంత్రులు,ఎమ్మెల్యేలు ఈ బాటలోనే ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల అభివృద్ధిపై దృష్టి పెట్టి అసెంబ్లీలో ప్రస్తావించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల అభివృద్ధిపై దృష్టిపెట్టి ఆదుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు.స్థానిక ఎంపీటీసీలు జడ్పీటీసీలు,సాగు భూములకు పోడు భూములకు ఆంక్షలు లేకుండా హక్కు పత్రాలు ఇచ్చి రైతు భరోసా,రైతు రుణం,రైతు బీమా కల్పించాలని కోరారు.స్థానిక ఉద్యోగ నియమాకాలు అటెండర్, అంగన్వాడీ,ఆయా,సిపరు,ఉద్యోగ నియామకాలు అమలు చేసి ఆదుకోవాలని ప్రభుత్వానికి తెలిపారు.ఈ సమావేశంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి గౌరవ సలహాదారు సింగరేణి రిటైర్డ్ జిఎం ఏ ఆనందరావు, గొల్లపల్లి దయానందరావు,రాష్ట్ర నాయకులు, ఇనుముల వెంకటేశ్వర్లు, కొమ్ము శ్రీరాములు,రాసమల్ల నరసయ్య, మ్యాచెస్, కండే రాములు,దాసరి యాకయ్య, సుందర్ పాల్, మెంతన మోహన్ రావు,తదితరులు పాల్గొన్నారు.