పదవీ విరమణ సింగరేణి కార్మికుడికి సహోద్యోగుల ఆత్మీయ సత్కారం

ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 1 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మణుగూరు ఏరియా పీకే ఓసి సెక్షన్ 2 రిలే సి లో డంపర్ ఆపరేటర్ గా పనిచేసి (మాజీ సైనికులు)పదవీ విరమణ చేసిన ఎం సురేష్, సునీత దంపతులను శనివారం నాడు పీవీ కాలనీ గోల్డెన్ ఫంక్షన్ హాల్ లో తోటి ఆపరేటర్లు సహోద్యోగులు పుష్పగుచ్చం శాలువా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. అంతకుముందు ఓసి-2గని ఆవరణలో సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాల నాయకులు కార్మికులు కూడా ఘనంగా సత్కరించారు. భారత సైనికునిగా దేశానికి విశిష్ట సేవలు అందించటమే కాకుండా అనంతరం సింగరేణి సంస్థలో ఆపరేటర్ గా చేరి సింగరేణి సంస్థకు సురేష్ చేసిన సేవలను పలువురు అధికారులు కార్మిక సంఘాల నాయకులు కొనియాడారు. ఉద్యోగపర్వంలో పదవీ విరమసర్వసాధారణమేనని సురేష్ విశ్రాంత జీవితం ఆనందమయం కావాలని ఆకాంక్షించారు.అనంతరం పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీకే ఓ సి-2 గని మేనేజర్ కె సురేష్ కుమార్, అధికారులు కోడి కృష్ణమూర్తి, నాగేంద్ర కుమార్,సంక్షేమ అధికారి ఓంకారి బాపు, కార్మిక సంఘాల నాయకులు వై రాంగోపాల్, ఎస్ కుమారస్వామి (ఏఐటీయూసీ) వత్సవాయి కృష్ణంరాజు, సిల్వేరు గట్టయ్య, (ఐ ఎన్ టి యు సి) మ్యాన్ వే క్లర్క్ శేఖర్ ఆపరేటర్లు మరియు సూపర్వైజర్లు, కార్మికులు ఆకారపు సమీంద్రచారి, మిద్దెపాక శ్రీనివాస్, ఐ శంకర్,పూజారి అర్జున్ రావు, ఈ యాకయ్య, మందా అంజయ్య, పొదేo శ్రీనివాస్, ఏ లక్ష్మీనారాయణ, సిహెచ్ శ్రీనివాస్, గోశిక కుమారస్వామి,ఎం రాధాకృష్ణ, పి శంకరాచారి, తాటి సత్యనారాయణ, కె బాబులాల్, కుడి కుడిపూడి సుధాకర్,మట్టపర్తి నాగరాజు,కుతుబుద్దీన్,ఈశ్వరయ్య,కే నాగరాజు,ఆరీఫ్ పాషా,దరిసా రమేష్ బాబు, పిసి మహాపాత్ర బిఎస్ పెరుమాళ్, బి భాస్కర్ రెడ్డి, నునావత్ రమేష్, అనిల్ కుమార్ పెద్ద ఎత్తున ఉద్యోగులు బంధుమిత్రులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now