ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 28 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా పీకే ఓసి సెక్షన్ 2 లో శావేల్ ఆపరేటర్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన స్పెషల్ గ్రేడ్ ఆపరేటర్ ఆకారపు సమీంద్ర చారి యశోద దంపతులను అధికారులు కార్మిక సంఘాల నాయకులు ఆపరేటర్లు ,సహోద్యోగులు శాలువా పూలమాలలు జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. శుక్రవారం నాడు ఓ సి-2 ఆవరణలో జరిగిన చారి సన్మాన సభలో గని మేనేజర్ కె సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సంస్థ పట్ల అంకితభావం, ఫిఫ్టీన్ క్యూబిక్ మీటర్ షావెల్ ఆపరేటర్ గా ఆయనకున్న ప్రత్యేకతలు ముప్పయి ఐదున్నర సంవత్సరాల పాటు ఆపరేటర్ గా చారి సింగరేణి సంస్థకు చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. అనంతరం చారి విశ్రాంత జీవితం ఆనందమయం కావాలని ఆకాంక్షిస్తూ దంపతులకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు మధుసూదన్, రిలే సి ఇంచార్జ్ భూక్య భాoగ్య, భూక్య రామదాస్ , కార్మిక సంఘాల నాయకులు సురేందర్ జానకి ప్రసాద్ గుర్తింపు సంఘం (ఏఐటీయూసీ), వత్సవాయి కృష్ణంరాజు, మిద్దేపాక పాక శ్రీనివాస్ ప్రాతినిధ్య సంఘం (ఐ ఎన్ టి యు సి) అధికారులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, రిలే సి ఆపరేటర్లు, కార్మికులు, సూపర్వైజర్లు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పదవీ విరమణ కార్మికుడికి సహోద్యోగుల ఆత్మీయ సత్కారం
by Naddi Sai
Published On: February 28, 2025 6:28 pm
