విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్టు

**విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్టు**

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం జూన్ 23

నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవస్థానం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జడ్పీహెచ్‌ఎస్ (జడ్.పి.హెచ్.ఎస్) ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు నాగారం మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్ర రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. వారు విద్యార్థులకు స్వయంగా నోట్‌బుక్స్ అందజేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ట్రస్టు నిర్వాహకులు చేపట్టిన ఈ సామాజిక సేవా కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు అందుకుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment