నాణ్యమైన విద్య సంస్కృతి సంప్రదాయాలను నేర్పే విద్యాలయం శ్రీ సరస్వతీ శిశు మందిరం

*నాణ్యమైన విద్య సంస్కృతి సంప్రదాయాలను నేర్పే విద్యాలయం శ్రీ సరస్వతీ శిశు మందిరం*

*25 సంవత్సరాల తరువాత అనుభవాలను వెల్లబుచ్చిన పూర్వ విద్యార్థులు*

*జమ్మికుంట జూన్ 29 ప్రశ్న ఆయుధం*

నాణ్యమైన విద్యతోపాటు సంస్కృతి సంప్రదాయాలను నేర్పే విద్యాలయాలు సరస్వతి శిశు మందిరాలు అని పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను వెలిబుచ్చారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ 2000 -2001 విద్యా సంవత్సరం 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులు వారి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకొని వారు మాట్లాడుతూ శ్రీ సరస్వతి శిశు మందిర్ నేర్పిన జ్ఞానాన్ని జోడించుకొని ఎంతో నైపుణ్యానికి పొందడం జరిగిందని పదవ తరగతి బ్యాచ్ లోని చాలామంది అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్లో, స్థిరపడడం జరిగిందని ఇప్పటివరకు పాఠశాలను మర్చిపోలేక పోతున్నామని వారి అనుభవాలను వెలిబుచ్చారు అనంతరం చదువు చెప్పిన గురువులను గౌరవంగా సత్కరిస్తూ పూల మొక్కను అందించారు ఎల్లప్పుడూ పాఠశాలకు రుణపడి ఉంటున్నామని విద్యార్థులు పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో పాఠశాల సమితి అధ్యక్ష ,కార్యదర్శులు ఆవాల రాజారెడ్డి, ఆకుల రాజేందర్, ప్రబంధకారిని అధ్యక్ష, కార్యదర్శులు శ్రీలం శ్రీనివాస్, దాసరి రవీందర్, పాకాల రవీందర్ రెడ్డి, కేతు పెళ్లి మాధవరెడ్డి ప్రధానాచార్యులు గుడికందుల సుదర్శన్, పూర్వాచార్యులు బుర్ర శివయ్య, చెరుకు సోమయ్య, డింగరి రవికుమార్ , దూడం సాంబయ్య ,త్రివెంగల ఆచార్యులు, ఆకినపల్లి వరప్రసాద్, శ్రీనివాస్, ఇ నుకొండ దేవేందర్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి ఆచార్యులు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment