Site icon PRASHNA AYUDHAM

మొరంల మాఫియాపై ఎస్సై దాడి – 9 ట్రాక్టర్లు సీజ్

IMG 20251018 201634

మొరంల మాఫియాపై ఎస్సై దాడి – 9 ట్రాక్టర్లు సీజ్

రాజంపేట మండలం పెద్దయిపల్లి వద్ద అక్రమ రవాణా అడ్డుకున్న పోలీసులుకామారెడ్డి జిల్లా ప్రతినిధిప్రశ్న ఆయుధం అక్టోబర్18

 

 రాజంపేట మండలంలోని పెద్దయిపల్లి గ్రామం సమీపంలో అక్రమంగా మొరంను తరలిస్తున్న తొమ్మిది ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. రాజంపేట ఎస్సై ఎన్. రాజు సిబ్బందితో కలిసి శుక్రవారం ఉదయం ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా, అనుమతి లేకుండా మొరంను రవాణా చేస్తున్న ట్రాక్టర్లు గుర్తించి సీజ్ చేశారు. ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించి, యజమానులపై కేసులు నమోదు చేశారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్సై రాజు హెచ్చరించారు.

Exit mobile version