ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని దిశానిర్దేశం

ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని దిశానిర్దేశం

జిల్లాలో మొదటి విడతలో 14 జడ్పిటిసి, 136 ఎంపిటిసి స్థానాలకు నోటిఫికేషన్ సిద్ధం 

 

– కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 8 

 

జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అధికారులు తో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి (MCC) అమలు పకడ్బందీగా జరగాలని, క్షేత్రస్థాయిలో ముందుగానే సమీక్షించుకుని అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె సూచించారు. నామినేషన్ల స్వీకరణలో ప్రజలకు సౌకర్యం కల్పించి, సెన్సిటివ్ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో మొదటి విడతలో 14 జడ్పిటిసి, 136 ఎంపిటిసి స్థానాలకు నోటిఫికేషన్ సిద్ధంగా ఉందని, ఆర్వోలు, ఏఆర్వోలకు ఇప్పటికే శిక్షణ పూర్తయిందని తెలిపారు. MCC బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయని, గురువారం నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) మరియు జెడ్పి సీఈఓ చందర్, డిఆర్వో సిహెచ్. మధుమోహన్, డిపిఓ మురళి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now