రైతులకు నేస్తంగా రాష్ట్ర ప్రభుత్వం – 9 రోజుల్లో రూ.9,000 కోట్లు విడుదల

రైతులకు నేస్తంగా రాష్ట్ర ప్రభుత్వం – 9 రోజుల్లో రూ.9,000 కోట్లు విడుదల

హైదరాబాద్‌, జూన్ 25 (ప్రశ్న ఆయుధం):

తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగగా మలచే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. కేవలం 9 రోజుల్లో రూ.9,000 కోట్లకు పైగా రైతు భరోసా నిధులు విడుదల చేయడం నేపథ్యంలో, రైతులకు మద్దతుగా మంగళవారం “రైతు నేస్తం” కార్యక్రమం నిర్వహించనుంది.రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణం (సచివాలయం ఎదురు) వేదికగా జరిగే ఈ వేడుకతో తుది విడత చెల్లింపులనూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనుంది. ఇదే విషయమై సీఎం అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగగా, పలు కీలక అంశాలపై నిర్ణయాలు వెలువడ్డాయి.

ముఖ్య నిర్ణయాలు:

 తెలంగాణ తల్లి విగ్రహాలు – నవంబర్ 9లోపు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఏర్పాటు

🔹 రీజినల్ రింగ్ రోడ్ (RRR) – చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకూ 201 కిమీ మేరకు ఆమోదం

🔹 గోదావరి జలాల హక్కుల పరిరక్షణ – బనకచర్లపై చట్టపరమైన పోరాటం కొనసాగించాలి

🔹 ఆంధ్రప్రదేశ్‌కి లేఖ – విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చకు ఆహ్వానం

🔹 కాళేశ్వరం విచారణ – కమిషన్ కోరిన సమాచారం గడువు లోపు సమర్పించాల్సినట్లు ఆదేశం

🔹 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా – రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం

🔹 విజన్ 2047 – రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేయాలన్న దిశగా ఆమోదం

🔹 క్యాన్సర్ కేర్ అభివృద్ధి – ప్రముఖ ఆంకాలజిస్ట్ డా. నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారుగా నియామకం

🔹 కొత్త మున్సిపాలిటీల ఆమోదం – ఇంద్రేశం, జన్నారం మున్సిపాలిటీగా ఏర్పాటుకు ఆమోదం.విద్యా విస్తరణ – శాతవాహన యూనివర్సిటీలో LLB, LLM, మహబూబ్‌నగర్‌ IIIT ప్రారంభం, హుస్నాబాద్‌లో ఇంజినీరింగ్ సీట్ల పెంపు త్రైమాసిక సమీక్ష విధానం – ఇకపై మంత్రివర్గ తీర్మానాలపై ప్రతి మూడు నెలలకోసారి సమీక్ష.మంత్రివర్గం చివరగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలకు రైతుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేసింది.మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి మీడియాతో ఈ వివరాలను పంచుకున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment