ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 2 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలను జిల్లా కేంద్రంలో ఘనంగానిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఉదయం 9:15 నిమిషాలకు ఐ డి ఓ సి కార్యాలయం లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందరాన్ని స్వీకరించారు.కొత్తగూడెం ప్రగతి మైదానంలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం శాసనసభ్యులు సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మరియు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ముందుగా అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకునివాళులర్పించారు. అనంతరం మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మంత్రి జిల్లా ప్రజలను ఉద్దేశించి, జిల్లాలో మరియు రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై తన సందేశాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి.అనంతరం రవాణా శాఖ, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, పశుసంవర్ధక శాఖ, అగ్నిమాపక శాఖ మరియు వైద్యశాఖ లు చేపడుతున్న పలు కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన శకటాలు ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం,విత్తు కొద్దీ పంట అనే నినాదంతో రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి మొదలుపెట్టారు.ఈ సందర్భంగా పలువురు రైతులకు వివిధ రకాల విత్తనాలను అందజేశారు.సమరయోధుల ను మంత్రి సన్మానించారు. వివిధ శాఖల వారు చేపడుతున్న కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను కలెక్టర్ మరియు ఎస్పీ పరిశీలించారు.తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో పదకొండు ఏళ్ళు నిండాయి. ఈరోజు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు శుభాభినందనలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమర వీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరెందరో అమర వీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాల్లో దశదిశలా వెలుగులు విరజిమ్ముతుంది. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పుకునేందుకు గర్వ పడుతున్నాను. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమ కారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలుపంచుకున్న చిన్నా పెద్దలందరికీ… పేరు పేరునా ప్రణామాలు.తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ -2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి అయోగ్ సమావేశంలో వెల్లడించారు.
తెలంగాణ రైజింగ్-2047 విజన్ లో నాలుగు కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచస్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది.
తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టీస్ పాలసీ, గ్రీన్ ఎనర్జిపాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది.
ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత. ఇది తెలంగాణ రూపురేఖలనే మార్చేస్తుంది.ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది. అందుకే, రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది.ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే వంటగ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇళ్ళు వంటి పథకాలతో పాటు, సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మహిళలు పెట్రోలు బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టారు. శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్ళను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి, ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో 150 బస్సులు ఇప్పటికే అందజేయటంజరిగింది
దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది నెలల కాలంలో 25 లక్షల 35 వేల 964 మంది రైతులను రుణ విముక్తులను చేయడం జరిగింది. 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. రైతుకు పెట్టుబడి సాయం పెంచి, రైతుభరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాం. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తూ, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాలో నగదు జమచేయడం జరుగుతోంది.
గత ఏడాది 2.90 కోట్ల టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10 వేల రూపాయలు పరిహారం ఇస్తున్నాం.సన్నధాన్యానికి క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నాం.భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయటం జరుగుతోంది.నిరుపేదలకు సన్నబియ్యంపేదల ఆకలి తీర్చటంతోపాటు, వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇళ్ళు, సన్నబియ్యం పథకాలను అమలుచేస్తున్నాం.
ఎస్సీవర్గీకరణతో సామాజిక న్యాయంసంక్షేమంతోపాటు సామాజికన్యాయంలో సయితం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తోంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ.
పారదర్శకంగా కులగణన నిర్వహించి , బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.యువతకు ఉపాధి, ఉద్యోగాలు ఈ రాష్ట్ర యువతే ప్రజా ప్రభుత్వ నిజమైన నిర్మాతలు. వారి భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ, యువత ఉపాధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేసింది. 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి, ప్రయివేటు రంగంలో లక్ష ఉద్యోగాలు సృష్టిస్తున్నాం.
రాజీవ్ అభయ హస్తం పథకం కింద సివిల్స్ చదివే వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నాం.
తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఎకానమీ స్టేట్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టాం.
25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 58 పాఠశాలల నిర్మాణం చేపట్టాం.పాఠశాలల అభివృద్ధికి విద్యాకమీషన్ ఏర్పాటుచేశాం.ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంరాష్ట్రంలో నిరుపేదలకు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం.రాష్ట్రంలోరూ ,,4లక్షల 50 వేల ఇందిరమ్మ ఇల్ళ నిర్మాణం లక్ష్యం.
రాష్ట్రంలో ఇప్పటికే గృహనిర్మాణాల ప్రారంభం. నిర్మాణ దశలను బట్టి లబ్దిదారుల ఖాతాలలో నగదు జమ.
చెంచులకు ఇందిరమ్మ ఇళ్ళు
గిరిజన ప్రాంతాలలోని చెంచులకు 10వేల గృహాలు కేటాయింపు చేసాం.గిరిజనుల భూములకు సాగునీరు,విద్యుత్సదుపాయానికి ఇందిర సౌర గిరి జల వికాసం” కార్యక్రమం ప్రారంభం.
హైదరాబాద్ కు అంతర్జాతీయ హంగులు.హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టాం. జీ.హెచ్.ఎం.సి లో కంటోన్మెంట్ విలీనం చేయాలన్న ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చాం.
ఫ్యూచర్ సిటీ పేరుతో 30 వేల ఎకరాలలో సరికొత్త నగర నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.అభివృద్ధి ప్రణాళికలో రాష్ట్రాన్ని మూడు జోన్లుగా వర్గీకరించాం.అవుటర్ రింగ్ రోడ్డు లోపల నగరాన్ని కోర్ అర్బన్ తెలంగాణ గా, ఔటర్ రింగ్ రోడ్డు- ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణ గా, రీజినల్ రింగ్ రోడ్డు ఆవల ప్రాంతాన్ని రూరల్ తెలంగాణ గా నిర్ణయించాం.
వరంగల్ విమానాశ్రయాన్ని సాధించాం.విశ్వ వేదికపై తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించడంలో విజయం సాధించాం. అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్, దావోస్, జపాన్ దేశాలలో పర్యటించి బారీగా పెట్టుబడులు సాధించాం.హైదరాబాద్ వేదికగా పలు గ్లోబల్ ఈవెంట్లు నిర్వహించాం. గ్లోబల్ సమ్మిట్, బయో ఏషియా సదస్సు, ప్రపంచ సుందరి పోటీలను విజయవంతంగా నిర్వహించాం.
తెలంగాణ రైసింగ్ 2047 నేపథ్యంలో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపుటకు పలు అభివృద్ధి కార్యక్రమాలుకు నాంది పలుకుతున్నాము.నీటిపారుదల శాఖ సీతారామ ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ పనులు పూర్తి అయ్యి 3 పంప్ హౌసులు ప్రారభించండం జరిగింది.
ప్రధాన కాలువ నుండి ఏన్కూర్ లింక్ కెనాల్ ద్వారా నీటి విడుదల జరిగినది. ఉప ప్రధాన కాలువ పనుల టెండర్లు జరుగుతున్నవి.
ఈ ప్రాజెక్ట్ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,57,574 ఎకరముల కొత్త ఆయకట్టుకు మరియు చిన్న నీటి తరహా చెరువుల క్రింద గల 42,935 ఎకరముల స్థిరీకరించుటకు ప్రతిపాదించబడినది.
సీతమ్మ సాగర్ బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ కొరకు 3123 ఎకరములు భూ సేకరణ పూర్తి అయినది. మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల ద్వారా (పెద్దవాగు, తాలిపేరు, కిన్నేరసాని) 37,060 ఎకరములకు, 2354 చిన్న తరహా నీటిపారుదల వనరులు కలవు వీటి యొక్క ఆయకట్టు 129058 నీటిపారుదల వసతి కల్పించబడుచున్నది.
రహదారులు మరియు భవనముల శాఖ : గత ఆర్థిక సంవత్సరంలో 415 కోట్ల రూపాయలతో 108 రహదారుల పనులు చేపట్టగా అందులో 75 పనులు పూర్తికాగా 33 పనులు పురోగతిలో ఉన్నాయి. జిల్లాలో మారుమూల ఉన్న గ్రామీణ ప్రాంతముల అంతర్గత రహదారులు కలుపుతూ 24 రోడ్లు మరియు 18 బ్రిడ్జిలు నిర్మాణ పనులకు 195 కోట్లు మంజూరు కాగా 15 పనులు పూర్తి కాగా 37 పనులు పురోగతిలో ఉన్నాయి.
జాతీయ రహదారులు, రైల్వే లైన్లు మరియు విమానాశ్రయ ఏర్పాటుజిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపేందుకు,పటిష్టమైన రవాణా వ్యవస్థ రూపొందించేందుకు గాను కొత్తగూడెం నుండి జగ్గయ్యపేట మరియు భద్రాచలం నుండి కాలేశ్వరం వరకు జాతీయ రహదారులు నిర్మాణ పనులు మంజూరు దశలో ఉన్నాయి.
పాండురంగాపురం నుండి మల్కాన్ గిరి వరకు రైల్వే లైన్ నిర్మాణ పనులు మంజూరు అయినవి దీనిలో భాగంగా మొదటి దశలోపాండురంగాపురం నుండి సారపాక వరకు రైల్వే లైన్ పనులను పూర్తి చేయాలని కోరడం జరిగింది.కొత్తగూడెంలో విమానాశ్రయ నిర్మాణానికి ఆమోదం కొరకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నది.
విద్యుత్ శాఖప్రజలకు నాణ్యమైన మరియు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా జిల్లాలో 38.5 కోట్ల నిధులతో 33/11 కె. వి 13 విద్యుత్ ఉప కేంద్రాలు మరియు , 3.67 కోట్ల రూపాయలతో కొత్తగా ఐదు 33 కెవి విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణ పనులు పూర్తి చేసుకొని వినియోగంలోనికి తీసుకురావడం జరిగింది.21.5 కోట్ల రూపాయలతో 33 కెవి 20 ఇంటర్ లింక్ లైన్లో పనులు చేపట్టగా అందులో నాలుగు లైన్లో పనులు పూర్తి అయి యోగంలోనికి రావడం జరిగింది మిగిలిన లైన్ల పనులు పురోగతిలో ఉన్నాయి.
ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి ఆమోదం : జిల్లా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా మారుమోగేలా దేశంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ స్థాపనకు ఆమోదం లభించి నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి.
భూ భారతి చట్టం 2025 రైతులకు మేలు జరిగే విధంగా, ఉన్న ఇబ్బందులు పరిష్కారం చేసేలా భూ భారతి చట్టం అమలులోకి తీసుకురావడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో అవగాహనా కల్పి, ఒక్క మండలంలో పైలట్ నిర్వహించి, రేపటి నుండి 20 జూన్ వరకు అన్ని మండలాల్లో గ్రామం వారీగా రెవిన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరగుతుంది.మారుమూల గ్రామాలు, నిరుపేదలు నివసిస్తున్న ఈ జిల్లా లో శాంతిభద్రతల పరిరక్షణలో, నేరాలు నిరోధించడంలో, రహదారుల ప్రమాదాల నివారణలో, మత్తు పదార్థాల మరియు సైబర్ నేరాల నియంత్రణ కొరకు కృషి చేస్తున్న పోలిస్ యంత్రాంగానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి విజయవంతం చేస్తున్న అధికారులకు, ఉద్యోగులకు అభినందనలు. జిల్లాను అన్ని రంగాలలో మొదటి స్థానంలో నిలుపుటలో ప్రజలు, ఉద్యోగులు, ప్రతి ఒక్కరు పనిచేయాలనీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా ఇక్కడకు విచ్చేసిన
ప్రజాప్రతినిధులకు, అధికారులకు, సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు, ప్రజలకు మరొక్కసారి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను.
ఈ వేడుకల్లో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం ఆర్డీవో మధు, తాసిల్దార్ పుల్లయ్య, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, విద్యార్థులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now