భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కొమరం భీమ్ ఆఫీస్ నందు కొమరం భీమ్ 84 వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఆదివాసి రాష్ట్ర నాయకులు సోయం సత్యనారాయణ అరేం ప్రశాంత్*
*జల్, జంగల్, జమీన్ నినాదంతో అడవి బిడ్డల స్వేచ్ఛ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన యోధుడు, గిరిజనుల ఆరాధ్య దైవం కోమరం భీమ్*
*తమ భూముల్లోంచి నిర్దాక్షిణ్యంగా గెంటేయడంతో కొమురం భీమ్ ఆధ్వర్యంలో 1940 ‘జోడేఘాట్(బాబేఝరి) సాయుధ తిరుగుబాటు మొదలైంది*.
*ఆదివాసీల స్వయం పాలన కోసం ఆయన చేసిన జోడేఘాట్ తిరుగుబాటు మహోజ్వల చరిత్రగా నిలిచింది*.
*ఆయన పోరాట స్ఫూర్తి ఆదర్శం. కొమురం భీం ఆశయ అడుగు జాడల్లో పయనిద్దాం. గోండు వీరుడికి జోహార్లు* .
ఆదివాసి అభివృద్ధి పోరుబాట కోసం నిరంతరం కృషి సాధనతో నా గిరిజనం అడవుల్లో కొండల్లో పడుతున్న బాధలను కష్టాలను తొలగించాలని అభివృద్ధి చెందాలని రాజకీయ చైతన్యం రావాలని వైద్య విద్య ఉపాధి ఉద్యోగం వ్యాపారాల్లో అన్ని రంగాల్లో ముందుండాలని లక్ష్యంతో హక్కులు జీవోలు చట్టాలు సంస్కృతులు సంప్రదాయాలు కోల్పోకుండా వాటి పరిరక్షణకై కొమరం భీమ్, స్ఫూర్తితో ఈ తరం యువతకు ఆదర్శం ప్రతి గ్రామ గ్రామ వాడ వాడ కొమురం భీమ్ పోరాట చరిత్ర స్ఫూర్తి తో ముందుకు సాగాలని తెలియజేశారు ఆదివాసి రాష్ట్ర నాయకులు సోయం సత్యనారాయణ అరేం ప్రశాంత్ ఈ కార్యక్రమంలో కోండ్రు శ్రీరాములు, పదం నాగరాజు తదితరులు పాల్గొన్నారు