Site icon PRASHNA AYUDHAM

పెద్దమ్మతల్లి కి పూజలు చేసిన రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ చైర్మన్ కొత్వాల

IMG 20241031 WA0392

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి అక్టోబర్ 31

దీపావళి పర్వదినం సందర్భంగా పాల్వంచ పెద్దమ్మతల్లి దేవాలయంలో రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు చేశారు. గురువారం పాల్వంచ మండలం పరిధిలోని జగన్నాధపురం శ్రీ కనకగదుర్గమ్మతల్లి (పెద్దమ్మతల్లి) దేవాలయంలో ప్రత్యేక పూజల్లో కొత్వాల పాల్గొన్నారు.
తెలంగాణా రాష్ట్ర ప్రజలు, ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజలు, రైతులు, కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు* ఆనందోత్సవాలతో జీవనం సాగించాలని అమ్మవారిని వేడుకొన్నారు. దీపావళి సందర్భంగా పండుగ ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలని, కొత్వాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు చింతా నాగరాజు, వై. వెంకటేశ్వర్లు,పాకలపాటి రోశయ్య చౌదరి భక్తులు, ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version