జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అభినందించారు
ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 19 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
వైద్య సిబ్బంది సేవలకు ప్రశంసలు మరింత అంకితభావంతో పనిచేయాలని పిలుపు వచ్చారు.
జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రి సిబ్బంది అద్భుతంగా సేవలను అందిస్తున్నారని రాష్ట్ర టీవీవీపీ కమిషనర్ డా అజయ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం,జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. మారుమూల ప్రాంతాలైన కూడా అంకిత భావం తో పని చేసి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని వారి సేవలను కొనియాడారు. ఈ రోజు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర టీవీవీపీ కమిషనర్ డా అజయ్ కుమార్ ఆసుపాత్రులలో అన్ని వార్డులను,ఓపి రూమ్స్, డయాలసిస్ వార్డ్, ఆపరేషన్ థియేటర్,ఫార్మసి స్టోర్ లను చూసి రోగులతో ఆసుపత్రిలో అందుతున్న సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు.యాభై పడకల ఆసుపత్రి అయినప్పటికీ వంద పడకల ఆసుపత్రి స్థాయి లో సేవలందిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ తో కలిసి పాల్వంచ పట్టణం లో ఒక ఫంక్షన్ హాల్ లో జిల్లాలోనిభద్రాచలం,చర్ల,అశ్వారావుపేట , బుర్గంపాడు , మణుగూరు,ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉత్తమ సేవలందించిన వైద్య సిబ్బంది కి ప్రశంస పత్రాలు అందించారు. ముందుగా చికిత్స పొంది ఆరోగ్యంగా ఉన్న వారీ నుండి అభిప్రాయాలు తెలుసుకున్నారు. సిబ్బంది మరింత బాధ్యతగా అంకిత భావం తో రోగులకు సేవ చేయాలని పిలుపిచ్చారు.జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో పవిత్ర మైనది అని ఆ వృత్తి లో వైద్య సిబ్బంది కు మాత్రమే ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉందన్నారు. కాబట్టి ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా సేవలు అందించాలన్నారు. జిల్లాలోని అన్ని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో సూపరింటెంట్లు,ఇతర వైద్య సిబ్బంది చాలా కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో డి సి హెచ్ ఎస్ డా రవి బాబు,జిల్లాలోని వైద్య విధాన పరిషత్ సూపరింటెండెంట్ లు,నర్సింగ్ ,పారామెడికల్ ,సానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
వైద్య విధాన పరిషత్ సిబ్బందిని రాష్ట్ర టీవీవీపీ కమిషనర్ డా అజయ్ కుమార్
by Naddi Sai
Published On: June 19, 2025 7:47 pm
