ప్రశ్న ఆయుధం న్యూస్ మే 14 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
ఏరియా జిఎం దుర్గం రామచందర్ కి వినతి పత్రం అందజేసిన కార్మిక సంఘాల నాయకులు, కాలనీవాసులు
మణుగూరు ఏరియా పీవీ కాలనీ క్వార్టర్స్ లో చోరీల నివారణకు సింగరేణి యాజమాన్యం పోలీసులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కోరుతూ ఏరియా కార్మిక సంఘాల నాయకులు ఏఐటియుసి సిఐటియు హెచ్ఎంఎస్ మరియు కాలనీవాసులు బుధవారం నాడు ఏరియా జిఎం దుర్గం రాంచందర్ గారికి వినతి పత్ర అందజేశారు .ఈ సందర్భంగా కాలనీ వెల్ఫేర్ కమిటీ సభ్యులు గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం (ఐ ఎఫ్ టి యు) రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ ఈనెల 12వ తేదీ రాత్రి ఏరియా పివి కాలనీలో సుమారు ఏడు క్వార్టర్లలో దొంగలు హల్ చల్ చేశారనీ తమ క్వార్టర్ లో కూడా దొంగలు పడ్డారని కొన్నిచోట్ల కార్ల కీస్ కూడా ఎత్తుకు వెళ్లారనీ.బంగారం వెండి ఆభరణాలతో పాటు నగదు లక్ష్యంగా ఈ చోరీ జరిగినట్లుగా అర్థమవుతున్నదన్నారు. బాధిత కుటుంబాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని ఇంట్లో చిన్న చిన్న వస్తువులే కానీ ముఖ్యమైన ఆభరణాలు జాగ్రత్త చేసుకోవటం కొంత ఉపశమనంగా భావించాలన్నారు, చోరీ సమాచారం అందుకున్న వెంటనే మన సెక్యూరిటీ అధికారులు పోలీసు అధికారులు కూడా చోరీ జరిగిన క్వార్టర్లను క్లూస్ టీం తో సందర్శించి ఆధారాలను సేకరించడంతోపాటు బాధితులకు కూడా ధైర్యం చెప్పి ఓదార్పు ఇవ్వటం అభినందనీయమని కానీ వేసవికాలం కుటుంబ సభ్యుల ప్రయాణాలు, పోలీస్ స్టేషన్ కి ఐదు కిలోమీటర్ల దూరం, ఉద్యోగుల నైట్ డ్యూటీలు పెద్దగా జన సంచారం లేని ప్రాంతం, కొన్ని క్వార్టర్లలో వెనుకనే దట్టమైన అటవీ ప్రాంతం, ఏదైనా సంఘటన జరిగినప్పుడు లేదా గుర్తు చేస్తేనే కానీ అమలు కానీ పోలీస్ పెట్రోలింగ్, జీతాల సమయంలో తప్ప మరలా ఆ ప్రాంతంలో పారా హుషార్ అని కాలనీ వాసులను అప్రమత్తం చేయని గూర్ఖాలు ఇవన్నీ దొంగలకు కలిసి వస్తున్న అంశాలు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పోలీస్ క్లూస్ టీంకి కూడా ఎలాంటి ఆధారాలు దొరక్కుండా హైటెక్ దొంగలు జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళ లక్ష్యాన్ని చేధిస్తున్నారనీ ఆయన అభిప్రాయపడ్డారు ఉద్యోగులకు నైట్ షిఫ్ట్ డ్యూటీలు తప్పవు కుటుంబ సభ్యులకు వేసవి సెలవుల్లో లేదా పండుగలకు పబ్బాలకు శుభకార్యాలకు అత్యవసర పరిస్థితులలో మెరుగైన వైద్యానికి ఇతర ఊళ్ళకు ప్రయాణం తప్పనిసరి నిన్న రాత్రి జరిగిన చోరీ సంఘటనలతో పీవీ కాలనీ వాసులు ఆందోళనకు గురయ్యారన్నారు. గతంలో చోరీలు జరిగినా కూడా మూకుమ్మడిగా ఇన్ని క్వార్టర్లలో జరగటం పివి కాలనీలో తొలిసారనీ. ఈ సంఘటనలతో కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో నైట్ షిఫ్ట్ డ్యూటీ కి వెళ్ళిన కార్మికుడు తను చేసే పని మీద కన్నా నా క్వార్టర్ ఎలా ఉందో ఏమిటో అని ఆందోళనకు గురయ్యే అవకాశం ఎక్కువ దయచేసి దొంగతనాల నివారణకు ఏరియా యాజమాన్యం మరియు పోలీసు శాఖ సమన్వయంతో ఈ క్రింది చర్యలు చేపట్టాలని మనవి చేసుకుంటూ కాలనీవాసులకు భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు అదేవిధంగా సోమవారం రాత్రి చోరీకి గురైన సొత్తు రికవరీ అయ్యేవిధంగా బాధితులకు న్యాయం చేసే విధంగా కూడా పోలీస్ శాఖ అధికారులతో మాట్లాడాలని ఏరియా జిఎం గారిని వారు కోరారు.యాజమాన్యానికి వారు చేసిన సూచనలు: పీవి కాలనీలో చోరీల నివారణకు చర్యల్లో భాగంగా యాజమాన్యం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా చూడాలి ఇవి కాలనీ వారాంతపు సంతతో పాటు ఇతర ప్రధాన కూడలిలో కూడా సీసీ కెమెరాలు ఇంకా విస్తృత పరచాలి, కాలనీలో విద్యుదీకరణ మెరుగుపరచాలి,పీవీ కాలన చుట్టూ పటిష్టమైన ఫెన్సింగ్ నిర్మించాలి , వివిధ రకాల చిరు వ్యాపారుల పేరుతో చేతివృత్తుల పేరుతో, కొరియర్ సర్వీసుల పేరుతో, ఇతరత్రా వ్యాపకాలతో కాలనీ సందర్శించేవారు సెక్యూరిటీ వారి అనుమతి తప్పనిసరి చేయాలి వారిపై నిఘా ఏర్పాటు చేయాలి , కంపెనీ ద్వారా వాటర్ ట్యాంకుల క్లీనింగ్ ఇతరత్రా నిర్మాణ పనులకు వచ్చే వర్కర్లు రాకపోకలపై కూడా నిఘా తప్పనిసరి చేయాలి , ప్రతిరోజు సింగరేణి సెక్యూరిటీ విభాగం సమన్వయంతో కాలనీలో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలి , పోలీస్ కంట్రోల్ రూమ్ పునరుద్ధరించాలి, పీవి కాలనీలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలి ప్రత్యేకించి ఎస్ టి పి ప్లాంట్, భద్రాద్రి స్టేడియం వెనుకగల అటవీ ప్రాంతం, కూన వరం వాటర్ ట్యాంక్, కూలగొట్టిన క్వార్టర్స్ ఇతర నిర్మానుష్య ప్రదేశాలలో గంజాయి సేవించేవారు, అమ్మేవారు ఇతరత్రా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై గతంలో మాదిరిగా పోలీసులు, యాజమాన్యం చర్యలు చేపట్టాలి,కాలనీ అభివృద్ధి దొంగతనాల నివారణ లక్ష్యంగా కాలనీ వెల్ఫేర్ కమిటీలు పునరుద్ధరించాలి ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు ఎం.వి రామనర్సయ్య, సిఐటియు నాయకులు వల్లూరు వెంకటరత్నం కొడిపల్లి శ్రీలత, కళ్యాణం రవికుమార్, ఐ ఎఫ్ టి యు నాయకులు అంగోత్ మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు పీవీ కాలనీ క్వార్టర్స్ లో చోరీల నివారణకు చర్యలు చేపట్టాలి
by Naddi Sai
Published On: May 14, 2025 7:48 pm
