*
*సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ డిమాండ్
ఈరోజు సేవాలాల్ సేన బూర్గంపాడు మండల అధ్యక్షులు సీతారాం నాయక్ ఆధ్వర్యంలో జరిగిన సంఘం సమావేశంలో జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ భూక్యా సాగర్ నాయక్ బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సమయంలో కొంతమంది పోలీస్ అధికారులు తనను గంజాయి కేసులో ఇరికించారని, అవమానాల గురి చేశారని మనస్థాపానికి గురై పురుగుమందు సేవించి ఆత్మహత్య ప్రయత్నించాడు, ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం పొందుతున్నాడు, వారి ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ భూక్యా సాగర్ పురుగుమందు తాగి ఆత్మహత్యకు కారకులపై ప్రభుత్వం వెంటనే పోలీసు ఉన్నంత అధికారులతో సమగ్ర విచారణ జరిపించి కఠినమైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా సాగర్ కు నాణ్యమైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని. ప్రభుత్వం అధికారులు సరైన పద్ధతిలో స్పందించకపోతే ఆందోళన చేపడుతామని అన్నారు. సాగర్ కు ఏమైనా జరిగితే వాంగ్మూలంలో ప్రకటించిన పేర్లు వారే బాధ్యత వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా అధికార ప్రతినిధి బానోతు నాగరాజు నాయక్ మండల ప్రధాన కార్యదర్శి బాదావత్ సురేష్ నాయక్ మండల యువసేన అధ్యక్షులు బానోతు సురేష్ నాయక్ భూక్య నరేష్ నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు