ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూలీ లైన్లో కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం జరిగింది.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూలీ లైన్ లో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం ను నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా మొత్తం సుమారుగా 250 ఇండ్లలో సోదాలు నిర్వహించడం జరిగింది. సరిగా పత్రాలు లేకుండా నెంబర్ ప్లేట్లు లేని 16 వాహనాలను సీజ్ చేయడం జరిగింది.అదే విధంగా 11 వాహనాలకురూ,,2400/- రూపాయల జరిమానా విధించడం జరిగింది.ఇద్దరు బెల్ట్ షాపు నిర్వాహకుల నుండి సుమారుగా 14,000/- ల రూపాయల మద్యం బాటిలను సీజ్ చేయడం జరిగింది. అనంతరం కూలీ లైన్ కాలనీ వాసులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట వ్యతిరేక మరియు సాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు.తమ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.మట్కా,జూదం,బెట్టింగ్,గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడమైనదని తెలిపారు.ఇట్టి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో సుమారుగా 100 మందికి పైగా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు
by Naddi Sai
Published On: November 22, 2024 6:44 pm
