మొబైల్ కు దూరంగా ఉంటే విద్యార్థులు లక్ష్యాలను సాధిస్తారు..
అవోప రాష్ట్ర అధ్యక్షులు శంకర్ సూచన
ప్రశ్న ఆయుధం జూన్ 29: కూకట్పల్లి ప్రతినిధి
అవసరానికి తగ్గట్లు మొబైల్ వాడాలని, మొబైల్స్ వాడకం తగ్గిస్తే విద్యార్థుల లక్ష్యాలను సాధిస్తున్నారని ఆర్యవైశ్య ఆఫీషల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (అవోప) రాష్ట్ర అధ్యక్షులు మలిపెద్ది శంకర్ సూచించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ 2024..25 కు గాను మేడ్చల్ జిల్లా కు చెందిన ఆర్యవైశ్య విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన సుమారు 150 మంది విద్యార్థుల కు మేడ్చల్ జిల్లా అవోపా కమిటీ ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాలను అభినందించారు. ఈ సందర్భంగా ఆదివారం కూకట్ పల్లి పి.ఏం.ఏం పాఠశాల ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి అవోపా రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య అతిధిగా హాజరై జిల్లా అధ్యక్షుడు పెండ్యాల నాగరాజు, ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, కోశాధికారి సతీష్ ల చేతుల మీదుగా శంకర్ విద్యార్థుల కు పురస్కారాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ తల్లిదండ్రులను గౌరవించడం విద్యార్థులు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయమన్నారు నిత్యం విద్యార్థులు ఉదయం 5 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో లేవడం అలవాటు చేసుకోవాలన్నారు. విద్యార్థుల అలవాట్లను తల్లిదండ్రులు ప్రతిక్షణం గమనించాలన్నారు. తప్పుదారిలో ప్రవర్తిస్తున్నారన్న అనుమానం కలిగితే వారిని సన్మార్గంలో పెట్టాల్సిన అవసరముందన్నారు. ప్రతి విద్యార్థి తనకు తాను అన్ని రంగాల్లో మొట్టమొదటి స్థానంలో ఉండాలని సంకల్పించుకొని ఆ సంకల్పాన్ని నెరవేర్చుకునే విధంగా వారి వారి ప్రవర్తనాలను మార్చుకోవలన్నారు. కార్యక్రమంలో ఆవోప రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వందనపు శిల్ప ఆర్యవైశ్య సంఘం, రాష్ట్ర జిల్లా అవొప సభ్యులు కట్టా రవికుమార్, పార్శి ప్రకాష్ గుప్తా, ప్రవీణ్ కుమార్ గుప్తా ,రమేష్ కుమార్ గుప్తా, రఘువంశి , నవీన్, వినయ్ తో పాటుగా ఆర్యవైశ్య ప్రముఖులు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు జిల్లాలోని నియోజకవర్గాల యూనిట్ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.