Site icon PRASHNA AYUDHAM

విద్యార్థులు పరీక్షల ద్వారా మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవాలి

IMG 20250220 WA0340

*విద్యార్థులు పోటీ పరీక్ష ల్లో తమ ప్రతిభను చాటాలి

ఏసిపి సబ్బతి, విష్ణుమూర్తి
ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 20 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
విద్యార్థులు పోటీ పరీక్షల్లో తమ ప్రతిభని చాటాలని వారిలో ఉన్న సృజనాత్మకత ను వెలికితీసేందుకు, ప్రతిభా పరీక్షలు ఉపయోగపడతాయని, విద్యార్థులు ప్రతిభా పరీక్షలు ద్వారా మానసిక ధైర్యాన్ని పెంచుకుని ఒత్తిడిని తగ్గించుకోవాలని *ఏసిపి సబ్బతి విష్ణుమూర్తి అన్నారు,
జూలూరుపాడు మండలంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి టాలెంట్ టెస్ట్ పేపర్ ఆవిష్కరణ , ఏసిపి విష్ణుమూర్తి , సిపిఐ మండల కార్యదర్శి గుండే పిన్ని వెంకటేశ్వర్లు,, ఆవిష్కరించారు.అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో
ఏసిపి విష్ణుమూర్తి , మాట్లాడుతూ దేశం లో మొట్ట మొదటి విద్యార్థి సంఘం, స్వాతంత్ర పోరాటంలో భరతమాత విముక్తి కోసం బ్రిటిష్ వారిపై అలుపెరుగని పోరాటం చేసి భారత దేశ స్వతంత్రంలో ప్రముఖ పాత్ర పోషించి, ఎందరినో అత్యున్నత మేధావులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని ఆయన అన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారమైద్వేయంగా
ఏఐఎస్ఎఫ్ పనిచేస్తుందని అన్నారు.విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఏఐఎస్ఎఫ్ చేస్తున్న కృషిని అందరు అభినందించాలని,మండల వ్యాప్తంగా ఉన్న పదవ తరగతి విద్యార్దులు ఏఐఎస్ఎఫ్ టేలెంట్ టెస్టులో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
సిపిఐ మండల కార్యదర్శి గుండు పిన్ని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యమాలతో పాటు విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ లు పెట్టడంతో వారిలో ఉన్న సృజనాత్మకతను పరీక్షల పైన వారికున్న భయాన్ని పోగొట్టేందుకే జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ను విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు.
ఏఐఎస్ఎఫ్ పదో తరగతి జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ ను విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పేపర్ను రూపొందించామని ఆయన తెలిపారు. వారి సిలబస్ నుండే 100 మార్కులకు ఆల్ఫాబెట్ రూపంలో అన్ని సబ్జెక్టులు ఈ ప్రశ్న పత్రంలో ఉంటాయని విద్యార్థులకు చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలను మాత్రమే ఈ పరీక్ష పత్రాల్లో ఇస్తామని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అయన కోరారు మండలం వ్యాప్తంగా 300 మంది విద్యార్థులు పరీక్షల కు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సాయి ఎక్స్ల్లెంట్ స్కూల్ కరస్పాండెంట్ ఆరబోయిన కృష్ణ ప్రసాద్ (కె.పి), హై స్కూల్ హెచ్ఎం లక్ష్మీ నరసయ్య, సీనియర్ ఉపాధ్యాయులు రాంశెట్టి శ్రీనివాసరావు, ఏ ఐ వై ఎఫ్ మండల కార్యదర్శి ఎస్.కె చాంద్ పాషా, పసుపులేటి పవన్ నాయకులు సందీప్, చింటు, సతీష్, గణేష్ రవి, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version