ఈనెల 27న ఇందిరా పార్క్ వద్ద జరిగే విద్యా పరిరక్షణ ధర్మాను విజయవంతం చేయండి

*ఈనెల 27న ఇందిరా పార్క్ వద్ద జరిగే విద్యా పరిరక్షణ ధర్మాను విజయవంతం చేయండి*

*డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి*

*జమ్మికుంట జూన్ 25 ప్రశ్న ఆయుధం*

ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే విధానాలను ప్రతిఘటిస్తూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 27న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని డి టి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి పేర్కొన్నారు బుధవారం రోజున కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోరపల్లిలో కరపత్రం ఆవిష్కరణ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సర్దుబాటు విషయంలో తెచ్చిన 25 జీవో నిబంధనలను రద్దు చేయాలని, విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే విధానాలను మానుకోవాలని ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను అరికట్టి ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ విద్యను అభివృద్ధి పరచుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. రాష్ట్రంలో విదేశీ ప్రైవేట్ విశ్వ విద్యాలయాలను అనుమతివ్వకూడదని ప్రాథమిక పాఠశాలల్లో ప్రమాణాలు గల పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టి అందుకు సుశిక్షితులైన ఉపాధ్యాయులను నియమించాలని, విద్యారంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వ రంగంలో ఉన్న 30 వేల పాఠశాలలను అభివృద్ధి చేసి , ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి పథంలో నడపాలని కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 27 న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న ధర్నాకు విద్యా పరిరక్షణ కమిటీ భాగస్వామ్య సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ మండల అధ్యక్షుడు వేణుమాధవ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎమ్. సమ్మయ్య, పి రాజయ్య పి రాజు కుమారస్వామి రవికాంత్ రాజు పద్మ విజెందర్ రెడ్డి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment