బాన్సువాడలో తిరంగా యాత్ర ర్యాలీ విజయవంతం
ప్రశ్న ఆయుధం 22 మే ( బాన్సువాడ ప్రతినిధి )
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ తిరంగ యాత్ర ర్యాలీ నిర్వహించారు.కుల మతాలకు అతీతంగా ప్రజలు,నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్ కు మన దేశం బుద్ధి చెప్పిందని నాయకులు తెలిపారు.పాకిస్తాన్ ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ఉగ్రదాడులు ఆపాలని వారు తెలిపారు.మళ్ళి ఉగ్ర దాడులు నిర్వహిస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేనట్టుగా చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో జహీరాబాద్ మాజీ ఎంపీ బిబి పాటిల్ మాజీ ఎమ్మెల్యే యేండల లక్ష్మీనారాయణ నాయకులు బద్య నాయక్ కోణాల గంగారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉప్పరి లింగం సున్నం సాయిలు ఏజాజ్ లక్ష్మీనారాయణ గురు వినయ్ కుమార్ పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.