రోడ్డు ప్రమాద బాధితురాలికి విజయవంతమైన శస్త్రచికిత్స

*మల్కాజ్‌గిరి పీహెచ్‌సీలో అత్యాధునిక ఉచిత దంత చికిత్సలు; రోడ్డు ప్రమాద బాధితురాలికి విజయవంతమైన శస్త్రచికిత్స*

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం మే 10

మల్కాజ్‌గిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో అత్యాధునిక డెంటల్ కేర్ యూనిట్ ద్వారా ప్రజలకు అత్యాధునిక దంత చికిత్స సేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా, రోడ్డు ప్రమాదంలో మాక్సిల్లా ఎముక (దవడ పైభాగం) విరిగి (పిరమిడల్ – లెఫోర్ట్ 2 ఫ్రాక్చర్) బాధపడుతున్న 39 ఏళ్ల నర్మద అనే మహిళ చికిత్స కోసం పీహెచ్‌సీని ఆశ్రయించారు.

డెంటల్ సర్జన్ డాక్టర్ పి. వినోద్ నేతృత్వంలోని వైద్య బృందం, స్థానిక మత్తు (లోకల్ అనస్థీషియా) ఇచ్చి బోన్ ప్లాటింగ్‌తో ఫ్రాక్చర్ రిడక్షన్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఈ చికిత్సతో పాటు పీహెచ్‌సీలో అందిస్తున్న అన్ని దంత సేవలు పూర్తిగా ఉచితమని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సి. ఉమా గౌరి మాట్లాడుతూ, మల్కాజ్‌గిరి పీహెచ్‌సీలో డాక్టర్ వినోద్ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న ఉచిత దంత సేవలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నవని చెప్పారు. ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఇటువంటి ఉచిత సేవలు ప్రజల ఆరోగ్య సంరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని డాక్టర్ ఉమా గౌరి పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment