Site icon PRASHNA AYUDHAM

మణుగూరు లారీ ఓనర్ అధ్యక్షులు దశరథం ఆకస్మిక మృతి

IMG 20241215 WA0280

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 15 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
మణుగూరు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు పెంట్యాల దశరథం ఆకస్మిక మృతి
దశరథం లేని లోటు ఎవరు తీర్చలేనిది పలువురు లారీ యజమానుల సంతాపం
అనారోగ్యంతో ఆదివారం ఉదయం హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన మణుగూరు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పెంట్యాల దశరథం (65) మృతి వార్త తెలిసిన ఏరియా తోటి లారీ యజమానులు సమావేశమై ఆయన మృతికి తీవ్ర సంతాపాన్ని తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. దశరథం కి భార్య ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు. కాగా మణుగూరు ఏరియా లారీ యజమానుల సంక్షేమానికి ఆయన ఎనలేని కృషి చేశారని ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిదని ఈ సందర్భంగా దశరథం సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏరియా లారీ యజమానులు మిడిదొడ్ల నాగేశ్వరరావు, తూపూడి శ్రీను, ఈశ్వరరావు, ఈశ్వర్ రెడ్డి, శాంతి కుమార్, చారి, మున్నా, బాబి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version