అయ్యప్ప దేవాలయంలో జరిగిన అవినీతినీ సుమోటో స్వీకరించి కేసు నమోదు చేసి ఈడి చేత విచారణ జరిపించాలి

*అయ్యప్ప దేవాలయంలో జరిగిన అవినీతినీ సుమోటో స్వీకరించి కేసు నమోదు చేసి ఈడి చేత విచారణ జరిపించాలి*

*సామాజిక కార్యకర్త సిలివేరు శ్రీకాంత్*

*జమ్మికుంట మే 10 ప్రశ్న ఆయుధం*

అపర శబరిమలైగా పిలువబడుతున్న జమ్మికుంట అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన అవినీతిని సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసి ఈడి చేత సమగ్ర విచారణ జరిపించాలని జమ్మికుంట పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త సిలివేరి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. శనివారం జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సామాజిక కార్యకర్త సిలివేరి శ్రీకాంత్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో 2006 నుండి 2025 వరకు అయ్యప్ప దేవాలయం అభివృద్ధి కోసం అయ్యప్ప స్వాములు, భక్తులు కానుకలు గా ఇచ్చిన కోట్లాది రూపాయలను అయ్యప్ప దేవాలయంలో తామే అన్నట్టుగా వ్యవహరిస్తున్న కొందరు వ్యక్తులు అయ్యప్ప దేవాలయానికి సంబంధించిన కోట్లాది రూపాయలను వివిధ రైస్ మిల్లులకు కాటన్ మిల్లులకు కాన్వాసింగ్ లకు చెక్కుల రూపకంగా కోట్లాది రూపాయలను అన్యాక్రాతం చేసినారనీ అయ్యప్ప స్వామి దేవాలయం లో అన్ని తానే అని వ్యవహరిస్తున్న కొందరు వ్యక్తులు వారు వారికి దగ్గర ఉన్న వ్యాపారవేత్తలకు తొత్తులుగా మారి పవిత్రమైన దేవాలయాన్ని దేవాలయానికి సంబంధించిన డబ్బును వారి స్వార్థ ప్రయోజనాల కోసం అయ్యప్ప దేవాలయంలోని భాగస్వాములకు అయ్యప్ప స్వాములకు భక్తులకు తెలియజేయకుండానే వారికి దగ్గర ఉన్న వ్యాపారవేత్తలకు డబ్బుతో పాటు దేవాలయానికి సంబంధించిన భూముల పైన ఈడి చేత సమగ్ర విచారణ జరిపించి వివిధ రైస్ మిల్లులకు కాటన్ మిల్లులకు కాన్వాసింగ్ లకు వ్యాపారులకు లావాదేవీల ద్వారా జరిపిన డబ్బును తిరిగి అయ్యప్ప దేవాలయానికి సంబంధించిన డబ్బును భూములను తెలంగాణ ప్రభుత్వం దేవాదాయశాఖ ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు. లేనియెడల జమ్మికుంట పట్టణ ప్రజలను తోపాటు అయ్యప్ప భక్తులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త సిలివేరి శ్రీకాంత్ హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment