సండే బ్రిక్స్ ఓపెన్ చాలెంజ్ ప్రతి ఒక్కరికీ అవకాశం

జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ ప్రకటన
ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 19 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
పర్యావరణ హితంగా మట్టి ఇటుకలు తయారు చేయండి ఆరోగ్యాన్ని పొందండి బహుమతులు గెలుచుకోండి అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఒక ప్రకటనలో తెలిపారు. సండే బ్రిక్స్ చాలెంజ్ పేరుతో మన జిల్లా యంత్రాంగం వినూత్నంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ఈ నెల
22. నుండి(ఆదివారం), ప్రగతి మైదానం, కొత్తగూడెం లో
ఉదయం 6: నుండి 9: గంటల వరకు జరిగే ఈ ఓపెన్ ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనవచ్చని తెలిపారు. బెంగళూరులోని సి ఎస్ ఇ బి నిపుణులు సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ప్రగతిమైదానంలో నిర్వహించబడుతుందని తెలిపారు.ఇది కేవలం పోటీ మాత్రమే కాదని, కొద్దిసేపు మట్టితో పనిచేసే అనుభవం ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని,మార్పు పట్ల కొత్త దృష్టిని కలిగిస్తుందన్నారు.ఎక్కువ ఇటుకలు తయారు చేసిన వ్యక్తిని బ్రిక్స్ ఛాంపియన్ గా గుర్తించి, తాను స్వయంగా టీ-షర్ట్ బహుమతి అందజేయడం జరుగుతుందని తెలిపారు. యువత, వాకర్లు,పౌరులు, విద్యార్థులు ఉదయం 7 గంటలలోపు హాజరై ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు.
ఈ కార్యక్రమం ద్వారా స్థానిక వనరుల వినియోగం, శ్రమకు గౌరవం, ఆరోగ్యకరమైన జీవనశైలి, సామాజిక ఐక్యత, వ్యక్తిగత చొరవ వంటి విలువలను పెంపొందించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు.
అదేవిధంగా, ఓపెన్ చాలెంజ్ అనంతరం అధికారులు, ఉద్యోగుల కోసం ఇట్టి ఇటుకలు తయారీ పై వర్క్‌షాప్ ఉదయం 9:నుండి మధ్యాహ్నం 1: గంట వరకు నిర్వహించబడుతుందని కలెక్టర్ తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment