మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారుల సర్వే
హైదరాబాద్ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు మధ్య అధికారుల సర్వే కొనసాగుతోంది. HYD జిల్లా పరిధిలో 16 బృందాలు సర్వే చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 4, మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో 5 బృందాలతో సర్వే జరుగుతోంది. నిర్వాసితుల నిర్మాణాల వివరాలను రెవెన్యూ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. బఫర్ జోన్లోని నిర్మాణాలకు మార్క్ చేయనున్నారు. ఇవాళ చాదర్ఘాట్, మూసానగర్, శంకర్నగర్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు సర్వే చేపట్టారు.