Site icon PRASHNA AYUDHAM

వ్యక్తి అనుమానాస్పద మృతి

IMG 20241105 WA0332

 

చర్ల సరిహద్దు ఛత్తీస్‌గడ్‌లో ఘటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి అతి సమీపంలోని సరిహద్దులో ఉన్న ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రం రాష్ట్రం సుక్మా జిల్లా గదిరాస్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గొండెరాస్‌ గ్రామానికి చెందిన నెమిడిపరా అనే గ్రామస్థుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. దీనిపై సుక్మా పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అతడిని మావోయిస్టులు హత్య చేశారా? లేదా ఆదివాసీల్లో అంతర్గత శత్రుత్వం కారణంగా హత్య జరిగిందా? అనే అంశంపై దర్యాప్తులో నిమగ్నమయ్యారు. సుక్మా ఎస్పీ కిరణ్‌ చవాన్‌ కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలను త్వరలో వెల్లడిస్తారని ఎస్పీ కిరణ్‌ చవాన్‌ తెలియచేసారు.

Exit mobile version