Site icon PRASHNA AYUDHAM

సూర్యాపేట లో ఠాగూర్ సీన్ రిపీట్..

ప్రాణం ఖరీదు అరవై వేలు..

సూర్యాపేట లో ఠాగూర్ సీన్ రిపీట్..

చనిపోయిన పేషెంట్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం.

ప్రభుత్వ వైద్యాన్ని కించపరిచే ప్రయత్నం చేసిన ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులు.

  1. ప్రవేట్ హాస్పటల్స్ పై చర్యలు తీసుకొని అధికారులు, నాయకులు..

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఠాగూర్ సినిమాలోని సీన్ ను రిపీట్ చేసింది. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన వ్యక్తికి మొదట ఓ ఇంజక్షన్ వేసి అపస్మార్క స్థితిలోకి తీసుకెళ్లిన సిబ్బంది అనంతరం మరో ఇంజక్షన్ వేసి. అతని మృతికి కారణమయ్యారు. ఈ విషయం మృతుని బంధువులకు తెలిసేలోపు మృతుని అంబులెన్స్ లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి అక్కడే చనిపోయినట్లు ప్రభుత్వ వైద్య0 పై నెట్టేందుకు ప్రయత్నం చేశారు. మృతి చెందిన వ్యక్తిని బంధువులకు సైతం సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించడం వెనుక ఆంతర్యం ఏమిటని బంధువులు ప్రశ్నించడంతో ఆస్పత్రి నిర్వహకులు నీళ్లు మింగిన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది…

Exit mobile version