Site icon PRASHNA AYUDHAM

సమగ్ర సర్వే పై జిల్లాలోని తహసీల్దార్లు, ఏం.పి.డి.ఒ. మండల ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష..

GridArt 20241112 203420245

సమగ్ర సర్వే పై జిల్లాలోని తహసీల్దార్లు, ఏం.పి.డి.ఒ. మండల ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం నవంబర్ 12:

ప్రభుత్వ ఆదేశాల ననుసరించి అవసరమైన పక్షంలో నిబంధనల మేరకు ఎన్యుమరెటర్లను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుండి జిల్లాలోని తహసీల్దార్లు, ఏం.పి.డి.ఒ., మండల ప్రత్యేక అధికారులతో ఇంటింటి సమగ్ర సర్వే పై మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతీ ఎన్యుమరేటర్ రోజుకు 15 నుండి 20 వరకు ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని, అందుకు అవసరమైన పక్షంలో ఎన్యుమ రిటర్లను నియమించుకోవాలని సూచించారు. ఎన్యుమరేషన్
బ్లాక్ ల వారీగా సమీక్షిస్తూ కొంతమంది తక్కువ ఎన్యూమ రేషన్ చేస్తున్నారని, వారు త్వరత్వరగా సమాచారాన్ని సేకరించాలని, కనీసం 15 ఇళ్ల సమాచారం సేకరించాలని తెలిపారు. అదేవిధంగా మున్సిపల్ ఏరియాలో కూడా ఎన్యుమరేషన్ వేగవంతం చేయాలని ఆదేశించారు. అవసరమైన పక్షంలో మెప్మ సిబ్బందిని నియమించుకోవాలని తెలిపారు.
ఏం.ఎల్.సి. కి సంబంధించిన ఓటరు నమోదు ఫారాలు పెండింగులో ఉన్నాయని, వాటిని త్వరగా ప్రాసెస్ చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు.
సమగ్ర సర్వే నిక్షిప్తం కోసం అవసరమైన కంప్యూటర్ లు, కంప్యూటర్ ఆపరేటర్ ల వివరాలు ఆయా మండల పరిషత్ అధికారులు స్ప్రెడ్ షీట్ లో అప్లోడ్ చేయాలని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వి.విక్టర్, ఆర్డీఓ రంగనాథ్ రావు, సీపీఓ రాజారాం, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version