యాదాద్రి,స్వర్ణగిరి ప్యాకేజీ టూర్ ను సద్వినియోగం చేసుకోండి
బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ ఆర్.సరితా దేవి
ప్రశ్న ఆయుధం 20 జూన్ ( బాన్సువాడ ప్రతినిధి)
బాన్సువాడ నుంచి యాదాద్రి, స్వర్ణగిరి ప్యాకేజీ టూర్ ను ఈనెల 27న నిర్వహిస్తున్నామని ఆసక్తి గల ప్రయాణకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాన్సువాడ డిపో మేనేజర్ ఆర్. సరితా దేవి పేర్కొన్నారు. యాదగిరిగుట్ట దర్శనం చేసుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని, బాన్సువాడ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరి యాదాద్రి నరసింహస్వామి దర్శనం అనంతరం,స్వర్ణగిరి ద్వారా రాత్రి 1 గంటకు బాన్సువాడ చేరుకుంటారన్నారు. టికెట్టు ధర వెయ్యి రూపాయలు (రూ. 1,000) టికెట్స్ బుకింగ్ కొరకు కే. గోపికృష్ణ, సెల్ : 9063408477 నెంబర్ కు సంప్రదించాలని కోరారు.