Site icon PRASHNA AYUDHAM

టీడీపీ అధికారంలోనే ఉంది – నరకలేరా!?

IMG 20250619 WA1146

*టీడీపీ అధికారంలోనే ఉంది – నరకలేరా!?*

మేము అధికారంలోకి వస్తే ఏదో చేస్తామని .. నరికేస్తాం.. పొడిచేస్తాం అని వైసీపీ వ్యూహక్రతలు బెదిరిచేందుకు పోస్టర్లు వేయిస్తున్నారు. వారిని చూసి అరిచే కుక్క కరుస్తుందో లేదో తెలియదు కానీ.. నిజంగా నరకడానికి..అధికారం అవసరం అయితే.. అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంది. గతంలో ఎప్పుడూ లేనంత బలంగా ఉంది. ఆ పార్టీ నరకాలనుకుంటే… ఎంత సేపు పడుతుంది ?. ఆ పోస్టర్లలలో వేసినట్లుగా రోజూ గంగమ్మ తల్లి జాతరలో యాటల్ని నరికినట్లుగా ఇరుక్కుంటూ పోతే ఎవరు ఆపుతారు?

అధికారంలో ఉన్న వారు నరకలేరా ?

అయినా నేను మారను.. అదే విధంగా నరకుతాం అని.. ప్రజల్లోకి పోతున్నారు జగన్ రెడ్డి. నరకడానికి అధికారమే అవసరం అయితే.. ఇప్పుడు ఎవరినైతే బెదిరిస్తున్నారో వారే అధికారంలో ఉన్నారు. వారికి ఎంత సేపు పడుతుంది?. ఇలాంటి చిల్లర రాజకీయాలతో ప్రజల్ని భయపెట్టి.. అమాయక కార్యకర్తల్ని బలి చేయడానికి జగన్ రెడ్డి పన్నుతున్న పన్నాగంలో.. ఇదంతా భాగం.

ఓటుతో సంహరించేది ప్రజలే !

అధికారంలో ఉంటే అన్నీ చేయవచ్చని.. దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, నేరాలు..ఘోరాలు చేయవచ్చని జగన్ రెడ్డి అనుకుంటూ ఉంటారు. తన క్యాడర్ కు కూడా అలాంటి సంకేతాలే ఇచ్చారు. అసాంఘిక శక్తులుగా తిరిగేవారే వైసీపీ క్యాడర్ . వారిని పావుగా వాడుకుని జగన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారు. తెనాలి పర్యటన అయినా.. పొదిలి పర్యటన అయినా.. సత్తెనపల్లి అయినా అదే వ్యూహం. సమాజంలో భయం కల్పించాలని ఆయన అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో భయం అనేది మిథ్య. ప్రజల దగ్గర ఓటు అనే పాశుపతాస్త్రం ఉంటుంది. ఎంతటి అరాచకుడినైనా ఓటుతో సంహరిస్తారు. గత ఎన్నికల్లో అదే జరిగింది.

నరుక్కోవడమేనా రాజకీయం !

రాజకీయ కక్షసాధింపుల్లో జగన్ రెడ్డి ఓ బెంచ్ మార్క్ సృష్టించారు. నిజానికి ఆయన చేసిన పనులకు.. ఇప్పుడు కక్ష తీర్చుకోవాలంటే.. చాలా ఘోరాలు జరిగిపోయి ఉండేవి. కేవలం .. చట్టపరంగా మాత్రమే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు కాబట్టే ఇంకా చాలా మంది బయటే తిరుగుతున్నారు. వారందరికీ సరైన సమయం చట్టప్రకారం వస్తుంది. కానీ జగన్ రెడ్డిలా .. నరకాలనుకుంటే..పెద్దగా సమయం పట్టదు.

Exit mobile version