Site icon PRASHNA AYUDHAM

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డికి మద్దతు

IMG 20250210 WA0372

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డికి మద్దతు

దివ్యాంగ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జంగం శ్రీశైలం

ప్రశ్న ఆయుధం న్యూస్, ఫిబ్రవరి 11, కామారెడ్డి :

నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు దివ్యాంగ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జంగం శ్రీశైలం తెలిపారు. తమ సంఘం తరఫున మద్దతు లేఖను కరీంనగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, పీఆర్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్ రెడ్డి సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినందున వంగ మహేందర్ రెడ్డి గెలుపునకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Exit mobile version