టి20 సిరీస్ ను క్లీన్ స్విప్ చేసిన టీమిండియా ..

టి20 సిరీస్ ను క్లీన్ స్విప్ చేసిన టీమిండియా  

IMG 20241013 WA0039

బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను భారత్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. మూడో మ్యాచ్ శనివారం రాత్రి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు ఆటగాళ్లు సిక్సర్లు, ఫోర్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకు పడ్డారు. సంజూ శాంసన్ ఎనిమిది సిక్సులు, 11 ఫోర్లతో 47 బంతుల్లో 111 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ ఐదు సిక్సులు, ఎనిమిది ఫోర్లతో 35 బంతుల్లో 75 పరుగులు చేశాడు. రియాన పరాగ్ 34, హార్దిక్ పాండ్య 47 పరుగులతో రాణించడంతో భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 297 పరుగులు భారీ స్కోర్ చేసింది.భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకిదిగిన బంగ్లాదేశ్ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. బంగ్లా బ్యాటర్లలో హిర్దోయ్ 63 నాటౌట్, లిటన్ దాస్ 42 పరుగులు మినహా మిగిలిన బ్యాటర్లు పరు గులు రాబట్టలేక పోయారు. దీంతో బంగ్లా జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ జట్టు 133 పరుగుల భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది.భారత్ జట్టు ఈ మ్యాచ్ లో టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు నమో దు చేసిన రెండో జట్టుగా నిలిచింది. ఆసియా గేమ్స్ లో మంగోలియాతో జరిగిన టీ20 మ్యాచ్ లో నేపాల్ జట్టు 314 పరుగులు చేసింది. నేపాల్ తరువాత 297 పరుగులతో టీమిం డియా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అయితే, టెస్టు క్రికెట్ ఆడే జట్లలో.. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన మొదటి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది..

Join WhatsApp

Join Now