ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 18 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశానుసారం జిల్లాలో రైన్ వాటర్ టీం మరియు స్టూడియో పంచతంత్ర బృందాల మూడు రోజుల పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ గత పర్యటనలో బెండలంపాడు, కనిగిరి గుట్టల వ్యూ పాయింట్ మరియు కాకతీయుల సాంస్కృతి బాహ్య ప్రపంచానికి చాటి చెప్పి, పర్యాటక రంగం అభివృద్ధి పరిచే ఉద్దేశంతో కలెక్టర్ సూచన మేరకు చివరి రోజు మంగళవారం చండ్రు గొండ మండలం బెండలంపాడు, పాలకోయలొద్ది నుండి దట్టమైన అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేసుకుంటూ కాలినడకన ద్వారా ప్రకృతి అందాలను వీక్షించుకుంటూ 1884 (564 మీటర్ల)అడుగుల ఎత్తుకు చేరుకొని అక్కడ బల్ల పరుపుగా ఉన్న విశాలమైన ప్రదేశంలో ఉన్నటువంటి వీరభద్ర స్వామి దేవాలయమును సందర్శించారు. కాకతీయుల సాంస్కృతి మరియు సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా 13వ శతాబ్దంలో గుట్ట చుట్టూ నిర్మించిన 15 అడుగుల ఎత్తులో ఉన్న రాతిగోడ ను సభ్యులు పరిశీలించారు. కాకతీయులు త్రాగునీటికి ఉపయోగించే ఏడాది పొడవునా నీరు ఉండే కోనేరులో మంచినీరు త్రాగి పరిశీలించారు. కాకతీయులు స్నానానికి ఉపయోగించేటువంటి పసుపు బావి, ఆ కాలంలో ఉపయోగించినటువంటి రోలు, ఇసురు రాళ్లు, ఏనుగుల మోటబావి మరియు కాకతీయుల కాలంలో వాడినటువంటి వివిధ వస్తువులను పరిశీలించారు. అనంతరం గుట్టపైన ఉన్నటువంటి ఆహ్లాదకరమైన ఆ వాతావరణం వ్యూ పాయింట్ మరియు ప్రకృతి అందాలను కెమెరాలలో చిత్రీకరించారు. బెండలంపాడు గ్రామంలో సాగు చేస్తున్నటువంటి వెదురు ప్లాంటేషన్ మరియు అడవిని బృందాలు పరిశీలించాయి. అనంతరం బెండలంపురం అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న పురాతన హస్తాల వీరస్వామి ఆలయంను సందర్శించి ఆలయ చరిత్ర మరియు అక్కడి గిరిజనుల సాంస్కృతి సాంప్రదాయాలగురించి అధికారులను తెలుసుకున్నారు. అనంతరం ములకలపల్లి మండలం నాయకుల పోడు గ్రామంలో మాస్క్ తయారీ కేంద్రంను బృంద సభ్యులు పరిశీలించి మాస్క్ తయారీ ప్రక్రియను చిత్రీకరించారు.
అనంతరం రైన్ వాటర్ ప్రాజెక్ట్ ఫౌండర్ సీఈవో కల్పన రమేష్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో జిల్లాలో మూడు రోజుల నేటితో ముగిసిందన్నారు. కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి కట్టడాలు, కాకతీయులు వాడిన వస్తువులను బెండలంపాడు ప్రకృతి అందాలు ఎంతో ఆనందాన్నిచ్చాయన్నారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాలతో బెండలంపాడు, కనిగిరి గుట్టల సందర్శనలో బృందాలు.
by Naddi Sai
Published On: December 18, 2024 5:49 pm
