ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (టీఈఎస్) ప్రవేశాలు…
ఇండియన్ ఆర్మీలో జూలై 2025లో ప్రారంభమయ్యే 53వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (టీఈఎస్) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన వారికి బీటెక్ కోర్సు, లెఫ్టినెంట్ పోస్టులకు ఉచిత శిక్షణ అందజేస్తారు.మొత్తం ఖాళీల సంఖ్య: 90.అర్హత: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ (మెయిన్స్) 2024లో ఉత్తీర్ణులై ఉండాలి…. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి..వయసు: 16.5 ఏళ్ల నుంచి 19.5 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: జేఈఈ (మెయిన్స్) స్కోరు, స్టేజ్–1, స్టేజ్–2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. కోర్సు, శిక్షణ: మొత్తం ఐదేళ్ల కోర్సు, శిక్షణ కొనసాగుతుంది. ఏడాది పాటు బేసిక్ మిలిటరీ ట్రైనింగ్, నాలుగేళ్లు టెక్నికల్ ట్రైనింగ్ ఇస్తారు.శిక్షణ , కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి ఇంజనీరింగ్(బీఈ/బీటెక్) డిగ్రీ అందజేస్తార