అభివృద్ధిలో వెనుకబడ్డ ఎస్సీ కులాలను ఎస్టీలతో సమాన అభివృద్ధి చేయాలని డిమాండ్*
ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 24
కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో టేకులపల్లి మండల తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి టేకులపల్లి మండల తహసిల్దార్ నాగభవానికి వినతి పత్రం అందజేశారు.వెనుకబడ్డ ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధిలో వెనకబడ్డ ఎస్సీ కులాలను కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం ఎస్టీలతో సమానంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమానికి షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.ఏజెన్సీ ప్రాంతం పేరుతో ఎస్సి కులాలను హక్కులకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కట్టుకున్న ఇంటిపైన తరతరాల సాగు భూములపైన ఎటువంటి హక్కులు అధికారాలు లేకుండా ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలను అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.2019 స్థానిక ఎన్నికల్లో ఎస్సీ,బిసి కులాల స్థానిక రిజర్వేషన్లు తొలగించి రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా తీరని అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏజెన్సీ ప్రాంతం ఎస్సీ కులాలను అభివృద్ధికి దూరం చేయడానికి తీవ్రంగా ఖండించారు.కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం హక్కులు కల్పించి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు ఎనగంటి అర్జున్ రావు,అరుణోదయ జిల్లా కళాకారుడు మెంతెన కొండల్ రావు,రాసమల్ల నరసయ్య, సుందర్ పాల్,దేవరాజు,ఎనగంటి శ్రీనివాస్,కండే రాములు, కుంపటి బెంజరావ్,సరికొండ స్వామి, కత్తుల వెంకన్న,కనకం శ్రీనివాస్, కుమ్మరి రవి, తదితరులు పాల్గొన్నారు.