పాఠశాలకు సమయానికి రాని ఉపాధ్యాయులు..?

పాఠశాలకు
Headlines
  • పాఠశాలలో సమయపాలనపై తీవ్ర విమర్శలు
  • టేక్మాల్ మండలంలో ఉపాధ్యాయుల ఆలస్యంపై విద్యార్థుల, తల్లిదండ్రుల ఆగ్రహం
  • పాఠశాలల్లో సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికులు, యువజన సంఘాలు
  • టేక్మాల్ మండలంలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం విద్యార్థుల భవిష్యత్తు పై ప్రభావం చూపుతుంది

ఉపాధ్యాయుల రాక కోసం పాఠశాల ముందు విద్యార్థులు ఎదురుచూపులు..!!

విద్యాధికారుల పర్యవేక్షణ కరువైన వైనం..??

సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైనం..?

ఉదయం తొమ్మిది దాటిన పాఠశాలలకు రాని ఆయా గ్రామాల ఉపాధ్యాయులు, సంబంధింత అధికారుల అలసత్వంతో లేదో మరి తేలియదూ కానీ సమయపాలన పాటించని ఉపాధ్యాయులతో విద్యార్థులకు శాపంగా మారిందిని స్థానికులు మండిపడుతున్నారు.

జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని దాదాయపల్లి, మల్కాపూర్, షాబాద్ తాండ, హసన్ మహ్మద్ పల్లి తాండ, పాఠశాలలోని ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండా సందేహం లేదని చెప్పకనే చెప్పవచ్చును. సోమవారం హాసన్ మహమ్మద్ పల్లి తాండ పాఠశాలకు 9:30 నిమిషాలకు హాజరు అవ్వగా షాబాద్ తాండ పాఠశాలకు 10:00 గంటలకు పాఠశాలకు ఉపాధ్యాయుడు హాజరయ్యారు. హసన్ మమ్మద్ పల్లి ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు విధుల్లో ఉండగా ఒకరు సెలవు పై వెళ్లగా ఇద్దరు ఉపాధ్యాయులు విధుల్లో ఉన్నప్పటికీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాత్రమే సమయానికి వచ్చి విద్యార్థులు ప్రేయర్ చేయించి విద్య బోధన బోధిస్తున్నారు. అదే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మరో ఉపాధ్యాయుడు తమకేమీ పట్టినట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో నాకేంటి అని నిర్లక్ష్యపు వైఖరి ధోరణిలో సమయ పాలనతో నాకేంటి అన్న చందంగా 10:00 గంటలకు తమ విధులకు హాజరైన ఉపాధ్యాయుడు. ఆయా గ్రామాలలో ఉపాధ్యాయుల కోసం పాఠశాలల ముందు విద్యార్థులు ఎదురుచూపులు. ఉపాధ్యాయులు ఆలస్యంగా తమ విధులకు హాజరై నిర్లక్ష్యం చూపుతున్నారు. ప్రభుత్వం విద్య అభివృద్ధి కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా ఉపాధ్యాయుల తీరు నిర్లక్ష్య వైఖరి కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాం నీరు గారి పోతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు తమ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని విద్యాశాఖ అధికారులు హెచ్చరించిన వైఖరి ఇంతే మా రూటే సపరేటు అన్న చందంగా సమయపాలన పాటించని ఉపాధ్యాయులు టేక్మల్ మండలంలో మరి ఇంకెంత మంది ఉపాధ్యాయులు ఉన్నారో . ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ఉపాధ్యాయుల విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదోనని సమగ్ర విచారణ చేపట్టి సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక ప్రజలు యువజన సంఘాల నాయకులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now