తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 4వ తేదీ ప్రత్యేకంగా జరుగనుంది.

*తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 4వ తేదీ ప్రత్యేకంగా జరుగనుంది.* ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. 11 గంటలకు కుల గణన సర్వేను సభలో ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. అయితే *తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.* అయితే దీని కంటే ముందే బీసీ కులగణనపై ఓ నిర్ణయానికి రావాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే కులగణన చేపట్టింది. *అసెంబ్లీ సమావేశాల్లో బీసీ కులగణనపై చర్చించనుంది. దీని కోసం ఈ నెల 4వ తేదీన అసెంబ్లీ సమావేశం నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.*

ఇప్పటికే కేబినెట్ సబ్‌కమిటీకి ప్లానింగ్‌ కమిషన్‌ అధికారులు కులగణన నివేదిక అందజేశారు. బీసీ రిజర్వేషన్లను పెంచడం కోసం కీలక నిర్ణయం తీసుకుని, పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రేవంత్‌ ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానించి, ఆ తర్వాత కేంద్రానికి పంపే అవకాశాలు ఉన్నాయి. *కులగణన సర్వేలో బీసీలు 55.85 శాతం ఉన్నట్లు సబ్‌కమిటీ నివేదికలో పేర్కొంది.* ఈ నివేదిక ప్రకారం పథకాలు, రిజర్వేషన్ల అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేయనుంది. దీని కోసం *న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా రిజర్వేషన్లు అమలు చేయడానికి రేవంత్ ప్రభుత్వంప్రణాళికలు రచిస్తోంది.* ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి బీసీల కోటా 40 శాతం పెంచుతామని చెప్పారు. దానికి అనుగుణంగానే 50 రోజుల పాటు కులగణన సర్వే చేయించారు. మొత్తం లక్షా 3,889 మంది అధికారులు సర్వే చేశారు. తెలంగాణలో 96.9శాతం కుటుంబాలు ఉన్నట్లు నివేదికలో తేల్చారు. ఈ సర్వేలో 3 కోట్ల 54 లక్షల మంది తమ వివరాలు నమోదు చేసుకున్నారు. 3.1శాతం సర్వేలో వివరాలు నమోదు చేయించుకోలేదని నివేదికలో కమిటీ తెలిపింది. అసెంబ్లీలో కులగణనపై చర్చించిన తదుపరి సభ ఆమోదం తెలపనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment