Headlines
-
సింగరేణి ఎంపికైన 593 మందికి నియామక పత్రాలు: సీఎం రేవంత్ రెడ్డి అందజేస్తారు
-
సింగరేణి ఉద్యోగ నియామకాలు: డిసెంబర్ 4న నియామక పత్రాల పంపిణీ
-
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సింగరేణిలో ప్రత్యేక కార్యక్రమాలు
-
సింగరేణి ఉద్యోగులను విజయోత్సవాల్లో ఘనంగా ఆహ్వానించనున్న తెలంగాణ ప్రభుత్వం
-
బెల్లంపల్లి: 593 మందికి సింగరేణి నియామక పత్రాలు – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
*తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు…..మరో రెండు రోజుల్లో 593 మందికి సింగరేణి ఉద్యోగ నియామకపత్రాలు అందజేత*
సింగరేణి సంస్థలో ఇటీవల కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన 593 మందికి నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా అందించనున్నారు.
డిసెంబరు 4న పెద్దపల్లిలో నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాల సభలో ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేయనున్నారని సింగరేణి సీఎండీ బలరాం ఓ ప్రకటనలో తెలిపారు.
విజయోత్సవాల నిర్వహణపై ఆయన తాజాగా సమీక్ష నిర్వహించారు.
విజయోత్సవాల్లో భాగంగా సింగరేణిలో కూడా కార్యక్రమాలు జరగనున్నాయి.
దీంతో సింగరేణిలో ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.