Headlines in Telugu
-
తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం: పత్రాలు సిద్ధంగా ఉంచండి
-
ధరణి పాస్ పుస్తకంతో పాటు ఆధార్ అవసరం: సర్వే వివరాలు
-
సర్వేలో 75 ప్రశ్నలు: సమగ్ర కుటుంబ సర్వే కోసం ఏ పత్రాలు అవసరం?
-
తెలంగాణ సర్వే వివరాలు సులభతరం చేసేందుకు పత్రాలు సిద్ధం
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి కుటుంబ సర్వే బుధవారం ప్రారంభమైంది. సర్వేలో మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. వీటి నుంచి సమాచారం సేకరిస్తారు. భూమి వివరాలు సేకరించే క్రమంలో ధరణి పట్టా నెంబరు, మెట్ట, తరి, పడావు వంటి భూమి రకం, ఎకరాలు గుంటల రూపంలో ఎన్యుమరేటర్కు చెప్పాల్సి ఉంటుంది. సాగు విస్తీర్ణం వివరాలు అనగా నీటి పారుదల వనరు, కౌలు భూమి సాగు వివరాలు చెప్పాలి. ఆధార్ కార్డులు, రైతులైతే అదనంగా ధరణి పాస్ పుస్తకాలు దగ్గర ఉంచుకోవాలి. సర్వే చేసినప్పుడు సులువుగా వివరాలు అందించవచ్చు.