Site icon PRASHNA AYUDHAM

తెలంగాణ ప్రభుత్వం భూభారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారం సులభతరం

IMG 20250617 WA2387

*తెలంగాణ ప్రభుత్వం భూభారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారం సులభతరం*

*భూభారతి రెవెన్యూ సదస్సులో తాసిల్దార్ వెంకటరెడ్డి*

*జమ్మికుంట జూన్ 17 ప్రశ్న ఆయుధం*

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన నూతన భూభారతి రెవెన్యూ ఆర్ఓఆర్ చట్టంతో భూ సమస్యలు సులభతరం కానున్నాయని జమ్మికుంట మండల తాసిల్దార్ నల్ల వెంకటరెడ్డి తెలిపారు మంగళవారం రోజున కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడుతూ రైతులు భూ సమస్యలు ఉంటే నూతన భూభారతి రెవెన్యూ ఆర్ఓఆర్ చట్టంలో సూచించిన విధంగా ఆర్జీలు పెట్టుకోవాలని వాటిని పరిష్కరించడానికి రెవిన్యూ సిబ్బంది రైతుల వద్దకు వెళ్లి పరిష్కారాన్ని చూపుతారని తెలిపారు కోరపెల్లి రెవెన్యూ సదస్సులో మొత్తం 269 దరఖాస్తులు వివిధ భూ సమస్యలపై రావడం జరిగిందని తాసిల్దార్ తెలిపారు వెంటనే వీటి పరిష్కారాన్ని చూపించడం జరుగుతుందని పేర్కొన్నారు

ఈ సదస్సులో తహశీల్దార్ నల్ల వెంకట రెడ్డి నాయబ్ తహశీల్దార్ శ్రీనివాస్ ,గిర్దావర్లు గడ్డం శంకర్ , సత్యనారాయణ ఎంపీఎస్ఓ రమేష్ సర్వేయర్ మనోజ్ రావు ఇతర రెవిన్యూ సిబ్బంది రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version