తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ డైరీ ఆవిష్కరణ..
కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వి. విక్టర్ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బాపు రావు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రసాద్ ఆధ్వర్యంలో డైరీ ని ఆవిష్కరించారు. సందర్భంగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బాపురావు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం జర్నలిస్టులు నిరంతరం కష్టపడి పని చేస్తున్నారన్నారు. తెలంగాణ పోరాటంలో ప్రజలను నాయకులను ఏకం చేసి రాష్ట్ర సాధనకు సైతం కృషి చేశారన్నారు. అన్ని వర్గాలను ప్రజల ను మమేకం చేస్తూ ప్రజల కోసం నిరంతరం ఐఎఫ్ డబ్ల్యూ జె అనుబంధంతో టీజేయు జర్నలిస్ట్ యూనియన్ కొనసాగుతుందన్నారు. 2025 సంవత్సర డైరీ ఆవిష్కరించడం సంతోషంగా ఉన్నన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా యూనియన్ సభ్యులు గోపాల్, శ్రీకాంత్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నారాయణ, రవి నాయక్, శ్రీకాంత్, పాల్గొన్నారు.