తెలంగాణ రాష్ట్రం ఇక ఫ్యూచర్ స్టేట్ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం అమెరికా లో ఐటీ సర్వ్ అలయన్స్ సమావేశం సందర్భంగా 2400 ఐటి కంపెనీల సంఘం ప్రజెంటేషన్ లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. పలు ఐటి కంపెనీలు ఇచ్చిన ప్రజెంటేషన్ ను వారు ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యూచర్ స్టేట్ గా రూపొందించే దిశగా కృషి చేస్తున్నారని, రాష్ట్రంలో ఐటి రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఆయన పనిచేస్తున్నారని, చదువుకున్న యువతకు ఉపాధి , ఉద్యోగావకాశాలు మెరుగు పరచడానికి అనేక మార్గాలను అన్వేషిస్తున్నారని అందులో భాగంగా అమెరికా లోని ఐటి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు..