తేలని ‘స్థానిక’ అంశం..!
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
తదుపరి సమావేశంలో చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పినట్లు సమాచారం. బిసిలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది. అయితే నవంబర్ 3న హైకోర్టు తీర్పు ఉండటంతో 7న మరోసారి భేటీ కావాలని సీఎం నిర్ణయించారు.
ఆ..రోజు రిజర్వేషన్లు, ఎలక్షన్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది…