Headlines
-
మమిడ్యాల గ్రామస్తుల గోడు: న్యాయం చేయండి
-
ఏడేళ్ల పోరాటం: కొండపోచమ్మ సాగర్ ముంపు బాధితుల ఆవేదన
-
సిద్దిపేట ప్రజావాణిలో మమిడ్యాల గ్రామ ప్రజల వినతి
-
న్యాయం చేస్తాం: అడిషనల్ కలెక్టర్ హమీద్
-
మమిడ్యాల గ్రామస్తుల న్యాయ పోరాటానికి కొత్త ఆశలు
ప్రజావాణిలో ముంపు గ్రామస్తుల దరఖాస్తులు
కొంత సమయం ఇవ్వండి న్యాయం చేస్తాం
అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్
సిద్దిపేట డిసెంబర్ 2 ప్రశ్న ఆయుధం :
కొండ పోచమ్మ సాగర్ ముంపు గ్రామమైన మామిడ్యాల గ్రామస్తులు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ కు వినతి పత్రం అందించారు. కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామమైన మామిడి గ్రామస్తులు తమకు పరిహారం కింద ప్యాకేజీలు డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు రాలేదని సోమవారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ కు వినతి పత్రం అందజేశారు. వారు అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో మాట్లాడుతూ మాకు ఏడు సంవత్సరాలు నుండి రేపు మాపు అని టైం పాస్ చేస్తున్నారని , న్యాయంగా మాకు రావాల్సిన పరిహారాన్ని మాకు అందించాలని అడిషనల్ కలెక్టర్ ను కోరారు. ఇప్పటికీ చాలాసార్లు ఏడు సంవత్సరాల నుండి ఎమ్మార్వో ఆర్డీవో కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగి మేము అలసిపోయామని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మా యందు కనికరపడి మాకు పరిహారం ఇప్పించాలని వారు అన్నారు. నెల రోజుల నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం పూర్తి జరిగిన కలెక్టర్ కలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము పుట్టిన స్థలం పాటలు సంపాదించిన స్థలాన్ని కోల్పోయిన న్యాయం చేయరా అని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో అనర్హులైన చాలామందికి ప్యాకేజీలు ఇల్లులు ఇచ్చారని అర్హులమైన మాకు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని ప్రభుత్వం గుర్తించడం లేదని గ్రామంలోని పెద్ద మనుషులు వారికి సంబంధించిన వారికి మాత్రమే పరిహారం ఇప్పించారని వారు అన్నారు. న్యాయబద్ధంగా మేము పోరాడుతున్నామని మాకు కచ్చితంగా మాకు రావాల్సిన పరిహారం ప్యాకేజీలు ప్రభుత్వం అందించాలని వేడుకున్నారు. గ్రామం కాళీ చేసే సమయంలో అధికారుల మాటలు విని మేము కాళీ చేశామని అయినా కూడా మమ్మల్ని ఇప్పుడు గుర్తించడం లేదని వారు అన్నారు. గ్రామంలోని పెద్దమనుషులు మాకు న్యాయం చేయకుండా మమ్మల్ని కొండపోచమ్మ సాగర్లో ముంచారని బాధితులు వాపోయారు ఇప్పటికైనా మాకు న్యాయబద్ధంగా ప్యాకేజీలు ఇప్పించాలని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ అమీదుతో తో గోడు వెళ్లబుచ్చుకున్నారు
ఈ సమస్యలను పరిష్కరిస్తాం.
మమ్మల్ని నమ్మండి మేము అధికారులను జిల్లా అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ మీకు న్యాయంగా రావలసిన ప్యాకేజీలు ఇప్పిస్తామని ఈ విషయమై కలెక్టర్ తో మాట్లాడుతానని అన్నారు. మీ బాధలు మాకు తెలుసు అని గ్రామంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి న్యాయంగా రావలసిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పరిహారం ఇప్పిస్తామని అడిషనల్ కలెక్టర్ అన్నారు.