తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలే నేటి ప్రపంచానికి ఆదర్శం: టీజేయు రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు
పినాకిని మీడియా ఆధ్వర్యంలో పినాకిని మీడియా
Ceo వంశీ శాస్త్రి తండ్రి జ్ఞాపకార్థం పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం
శ్రీ విద్యా శక్తి పీఠం రామకృష్ణాపురం – హైదరాబాద్ నందు జరిపారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిధి గా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద రావు మాట్లాడుతూ
తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలే నేటి ప్రపంచానికి ఆదర్శం : మారుతున్న కాలానికి తెలుగు సంస్మృతి, సంప్రదాయాలే నేటి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయనీ మానవాళి మనుగడకి పంచాంగం ఆదర్శం అన్నారు.
జ్యోతిష్యం మూఢనమ్మకం కాదని ఆధ్యాత్మికతకు అభ్యున్నతికి పరమార్థ సాధనకు జ్యోతిష్య శాస్త్రమే మూలం అని అన్నారు.
పినాకిని మీడియా వంశీ శాస్త్రి నాన్న తో ఉన్న అనుబంధం ని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో లో
బ్రాహ్మణ సంఘ నాయకులు పంచాంగ విశిష్టతను గురించి విశిష్టతను వివరించారు.
ముఖ్య అతిథిగా కప్పర ప్రసాద రావు , ఆత్మీయ అతిథిలుగా దేవి ఉపాసకులు నారాయణ చక్రవర్తి, దడిగం సుధాకర్, వజ్జ సుధాకర్, డా. శ్రీకాంత్ కులకర్ణి,రుద్రవీణ సుబ్రమణ్యం, కురుమేటి శ్రీనివాస్ శర్మ, మంగు రాఘవరావు ,గొట్టిముక్కుల నర్సింహా శర్మ తదితరులు పాల్గొన్నారు.