Site icon PRASHNA AYUDHAM

కౌలు రైతులకు ఇచ్చిన రైతు భరోసా మాటేమిటి..?

కౌలు
Headlines in Telugu
  1. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం
  2. రైతు భరోసా పథకం కౌలు రైతులకు ఎవరూ గుర్తించడం లేదంటూ పత్తి రైతుల సంఘం
  3. కౌలు రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని పత్తి రైతుల సంఘం డిమాండ్
  4. కౌలు రైతుల సమస్యలపై తెలంగాణ పత్తి రైతుల సంఘం తీవ్రంగా ఆందోళన
  5. తెలంగాణ రైతుల భవిష్యత్తుపై కాంగ్రెస్ హామీలు: కౌలు రైతుల విస్మరణ

*తెలంగాణ పత్తి రైతుల సంఘం రాష్ట్ర కో కన్వీనర్ చెల్పూరి రాములు*

జమ్మికుంట డిసెంబర్ 1 ప్రశ్న ఆయుధం::-*

కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో కౌలు రైతులకు సైతం రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన మాటేమిటని తెలంగాణ పత్తి రైతుల సంఘం రాష్ట్ర కో కన్వీనర్ చెల్పూరి రాములు అన్నారు.ఆదివారం జమ్మికుంట పట్టణంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కౌలు రైతులను గుర్తించి వారికి రైతు భరోసా పథకాన్ని అందిస్తామని, గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన కౌలు రైతులకు రైతు భరోసా ద్వారా ఎకరానికి రూ 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చి ప్రజా పాలన 6 గ్యారంటీలలో కూడా కౌలు రైతులను జోడించిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు రైతు పండుగ పేరుతో కౌలు రైతులను విస్మరించడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వం వెంటనే కౌలు రైతులకు తక్షణ న్యాయం చేయాలని, తెలంగాణ పత్తి రైతుల సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుందని ఆయన పేర్కొన్నారు

Exit mobile version