*విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ*
*యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపెల్లి నాగరాజు*
*జమ్మికుంట మార్చి 12 ప్రశ్న ఆయుధం*
యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో జమ్మికుంట మండలంలోని మడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, స్కెల్ విద్యార్థులకు ఉపయోగపడే పలు వస్తువులు అందజేశారు అనంతరం పంపిణీ కార్యక్రమానికి హాజరైన మండల విద్యాధికారి హేమలత మాట్లాడుతూ చదువుతోనే బంగారు భవిష్యత్తు కు బాటలు వేసుకోవచ్చని విద్యతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలని 10 వ తరగతి తోనే భవిష్యత్ కు తొలిమెట్టని అదే విధంగా పదవ తరగతి లో 100% ఉత్తిర్ణత సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం పర్లపల్లి నాగరాజు మాట్లాడుతూ.. పదవ పరీక్షల్లో కరీంనగర్ జిల్లాలోనే జమ్మికుంట మండలం అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. అదే విధంగా 10/10 సాధించిన విద్యార్థులకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించే విధంగా బహుమతులు అందజేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ ఎగ్గటి సదానందం, ఉప్పుల సాంబాశివ రెడ్డి, మ్యాకమల్ల అశోక్, మంగ అశోక్, ఎగ్గటి కుమారస్వామి, పల్లాకొండ సదానందం, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గంగారపు మహేష్, మండల ఉపాధ్యక్షులు రాచపల్లి సాగర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు పంజాల అజయ్, చెన్నావేనా రమేష్, అమృత శివ పర్లపల్లి అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.