తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ మేరకు సోమవారం రాత్రి జీవో జారీ చేసింది. అంతేకాదు.. గల్ఫ్ కార్మికుల వెల్ఫేర్ కోసం అడ్వైజరీ కమిటీ నియమించనుంది. ప్రవాసి ప్రజావాణి పేరుతో ఫిర్యాదులు స్వీకరించనున్నది. బతుకుతెరువు కోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ పడుతున్న బాధలు, వేర్వేరు కారణాలతో అక్కడ మృతి చెందే ఘటనలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున వారి కుటుంబాలను ఆదుకోడానికి ఈ నిర్ణయం తీసుకున్నది. అంతేకాదు.. వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యావకాశాలను కల్పిస్తున్నట్లు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఇటీవలే ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, మంత్రి వర్గానికి, ఇటీవలే గల్ఫ్ దేశాలలో తిరిగి మన తెలంగాణ ప్రాంతము నుండి వెళ్లిన గల్ఫ్ కార్మికుల కష్టాలను తెలుసుకొని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సమస్యలను వివరించి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన అశ్వారావుపేట శాసన సభ్యులు జారే ఆదినారాయణ కి ప్రత్యేకమైన ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియచేసిన యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్ష అభ్యర్థి కాక రమేష్ .