Site icon PRASHNA AYUDHAM

మున్సిపాలిటీగా అశ్వరావుపేట ను అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు

IMG 20250609 WA02131

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ( ఆర్సి జూన్ 9)

అశ్వారావుపేట పేరాయి గూడెం గుర్రాలచెరువు గ్రామ పంచాయతీలను కలిపి కొత్త మున్సిపాలిటీగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మన మున్సిపాలిటీ – మన అభివృద్ధి గురించి. ప్రజలకు అవగాహన కల్పించేందుకు మన మున్సిపాలిటీ మన అభివృద్ధి అనే అవగాహన సదస్సును స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిర్వహించారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు స్థానికులు మండలస్థాయి నాయకులు అఖిలపక్షాలు మున్సిపల్ నిపుణులు పాల్గొన్నారు. కొత్త మున్సిపాలిటీ అభివృద్ధిపై ముఖ్యమైన సలహాలు సూచనలు అనుభవజ్ఞుల నుంచి సేకరించారు. నూతన మున్సిపాలిటీ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించనున్నట్టు ఎమ్మెల్యే వివరించారు. త్రాగునీటి సరఫరా రహదారులు విద్యుత్ వ్యవస్థ ఆరోగ్యం విద్యా సదుపాయాలతో పాటు అన్ని రంగాల అభివృద్ధిపై దృష్టి పెట్టనున్నామన్నారు. మున్సిపాలిటీ రూపంలో అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. నూతన మున్సిపాలిటీగా అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి, తుమ్మల నాగేశ్వరరావు కి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల భాగస్వామ్యం వారి సహకారం వల్లే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

Exit mobile version