*జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటే*
పాఠశాల ఆవరణలో పాఠ్యపుస్తకాలు విక్రయిస్తే సహించేది లేదు*
*ఫీజు నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు పరచాలి*
*పాఠశాలలో పుస్తకాలు అమ్మితే భౌతిక దాడులకీ దిగుతం*
*ప్రైవేట్ పాఠశాలలకు కొమ్ముకాస్తున్న విద్యా శాఖ అధికారులు*
*విద్యార్థి యువజన సంఘ నాయకులు*
*హుజురాబాద్ జూన్ 26 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ కేంద్రంలో విద్యార్థి యువజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు అనంతరం విద్యార్థి యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ విద్యను వ్యాపారం చేస్తూ పాఠశాలల ఆవరణలో అధిక ధరలకు పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నారని నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలు తమ ఇష్టానుసారంగా వసూలు చేస్తుంటే విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలలకు కొమ్ముకాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పాఠశాలల ఆవరణలో పాఠ్యపుస్తకాలు భౌతిక దాడులకు కూడా వెనుకాడబొమని హెచ్చరించారు ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడాలు మితిమీరుతున్నాయని పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు పాఠశాలల యాజమాన్యం విద్యాశాఖ అధికారులు తీరు మార్చుకోకపోతే అఖిలపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు టేకుల శ్రావణ్ కొలుగూరి సూర్యకిరణ్ పర్లపల్లి నాగరాజు కర్ర శ్రీధర్ రెడ్డి పంజాల రేవంత్ గండు ప్రశాంత్ యాదవ్ ఆలేటి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు